Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్యగా అమల అందరికీ ఎంతో సుపరిచితమే. వివాహానికి ముందు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈమె నాగార్జున వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు. ఇలా కుటుంబ బాధ్యతలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అమల చాలా కాలం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో తల్లి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఈమె తాజాగా మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ రీతు వర్మ జంటగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమాలో అమల శర్వానంద్ తల్లి పాత్రలో సందడి చేయబోతున్నారు.ఇక ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న అమల ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇకపోతే ఈ సినిమా 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాదులో పలువురు సినీ సెలబ్రిటీల కోసం ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ చూడటానికి నాగార్జున, అఖిల్, అమల, డైరెక్టర్ హను రాఘవపూడి, చందు మొండేటి వంటి ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక ఈ సినిమా చూసిన అనంతరం నాగార్జున ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.
ఈ సినిమాలో అమ్మ పాత్రలో అమల ఎంతో అద్భుతంగా నటించిందని ఈమె తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని డైరెక్టర్ శ్రీకాంత్ ఎంతో అద్భుతంగా సినిమా చేశారంటూ ఈయన చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు. ఇక మదర్ సెంటిమెంట్ తో వచ్చినటువంటి ఈ సినిమా చూసిన అఖిల్ సైతం ఎమోషనల్ అయ్యారు. ఇక సినిమా తప్పకుండా హిట్ అవుతుందని,ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఈ సినిమా ఆకట్టుకుంటుంది అంటూ ఈ సందర్భంగా నాగార్జున సినిమా విజయం పై ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…