Namrata: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి తెలియని వారంటూ ఉండరు. 1993లో మిస్ ఇండియాగా ఎంపికైన నమ్రత ఆ తర్వాత పలు వానిజ్య ప్రకటనలలో నటించింది. ఆ తర్వాత సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో మహేష్ బాబుతో ప్రేమలో పడి కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా దూరం అయింది. భార్యగా, తల్లిగా తన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. నమ్రత కేవలం కుటుంబానికి సంబంధించిన విషయాలను చూసుకోవడమే కాకుండా మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు మహేష్ బాబు వ్యాపారాలు సంబందించిన విషయాలను కూడా నమ్రత చూసుకుంటుంది.
ఇలా ఇల్లాలిగా మాత్రమే కాకుండా మహిళా వ్యాపారవేత్తగా కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నమ్రత మహేష్ బాబు సినిమా విశేషాలతో పాటు కుటుంబానికి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునేది. ఇటీవల కొడుకు గౌతమ్ ఒంటరిగా విదేశాలకు వెళ్లడంతో నమ్రత ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇక తాజాగా తన తండ్రి నితిన్ శిరోద్కర్ ని తలచుకొని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ లో
“గత 16 సంవత్సరాలుగా నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను పప్పా… నీతో గడిపిన ప్రతి జ్ఞాపకం ఇప్పటికీ నా మదిలో పదిలంగా ఉండిపోయాయి. ఇప్పటికీ ఏమీ మారలేదు. నువ్వు మమ్మల్ని వదిలి చాలా త్వరగా వెళ్ళిపోయావు పప్పా.. అనంతమైన నా ప్రేమను వెలుగులను ఎప్పటికీ నీకు పంపుతూనే ఉంటాను ” అంటూ తన తండ్రిని తలచుకొని నమ్రత ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…