Nandamuri KalyanRam : కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం బింబిసార. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. ఎంత మంచివాడవురా సినిమా తరువాత చాలా గ్యాప్ తో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. బింబిసార సినిమాకి సంబంధించి ట్రైలర్ కూడా ఇటీవల విడుదల చేశారు. ప్రేక్షకులను సైతం ఈ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. అయితే ట్రైలర్ విడుదల కార్యక్రమం కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హీరో కళ్యాణ్ రామ్ చేతికి పచ్చబొట్టు కెమెరా కంటికి చిక్కింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా వుంది.
తన భార్య స్వాతి పేరును పచ్చబొట్టుగా…
అభిమానులలో నందమూరి వారసులకు వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. నందమూరి నట వారసులలో కళ్యాణ్ రామ్ ఒకరు. 2003 సంవత్సరంలో తొలిచూపులోనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. 2006 సంవత్సరం ఆగష్టు నెల 10వ తేదీన కళ్యాణ్ రామ్ వివాహం స్వాతి తో జరిగింది. స్వాతి వృత్తి రీత్య డాక్టర్. నందమూరి హీరోలు కుటుంబ బంధాలకు చాలా విలువ ఇస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇది మరోసారి రుజువు అయ్యింది.
కళ్యాణ్ రామ్ తన చేతి మీద తన భార్య స్వాతి పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు. తన భార్య మీద తనకున్న ప్రేమను చెప్పకనే చెప్పేసాడు. అయితే కళ్యాణ్ రామ్ ఈ పచ్చబొట్టును చాలా సంవత్సరాల క్రితమే వేయించుకున్నాడు. కాకపోతే ప్రస్తుతం సోషల్ మీడియా లో దీనిమీద వార్తలు వస్తున్నాయి. అంతేకాదు కళ్యాణ్ రామ్ కుమారుడు శౌర్య రామ్, కూతురు తారక అద్విత తో పాటు వున్న ఫ్యామిలీ ఫోటోలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంతున్నాయి. ప్రస్థుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…
ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కొత్త విషయం కాదు. అయితే కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికప్పుడు…
ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖ స్థానం ఉన్న అశ్వగంధపై కేంద్ర సంస్థలు కీలక నిర్ణయం తీసుకోవడం ఆరోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.…