Nandhamuri Mohan Krishna : గత కొద్దిరోజులుగా ఎన్టీఆర్ మనవడు మోహనకృష్ణ తనయుడు తారక రత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుగు ప్రజలు ఎక్కువగా తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. లోకేష్ చేపట్టిన యువ గళం సభలో పాల్గొని పాదయాత్రలో వెళ్తుండగా ఒక్కసారిగా తారక రత్న కుప్పకూలి పడిపోయాడు. గుండెపోటు వచ్చిందని నిర్ధారణ అయ్యాక వెంటనే బెంగళూరు తరలించి చికిత్స అందిస్తున్నారు. గుండె పనిచేయడం ఆగిపోవడం, తారక రత్నకు మల్టిపుల్ బ్లాక్స్ శరీరంలో ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక అన్ని విషయాలను బాలకృష్ణ పక్కనే ఉండి చూసుకుంటూ ఉండటంతో అసలు తారక రత్న తండ్రి కనిపించడం లేదు ఆయన ఎందుకు కొడుకు వద్దకు రాలేదు అనే సందేహాలు మొదలయ్యాయి.
మోహన్ కృష్ణ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడే…
తారక రత్నకు తండ్రి మోహన్ కృష్ణకు మధ్య తారక రత్న ప్రేమ పెళ్లి వల్ల గ్యాప్ వచ్చింది. అయితే తారక రత్నకు పాప పుట్టాక ఆ దూరం తరిగిపోయింది. నిజానికి మోహన్ కృష్ణ కూడా ఇండస్ట్రీకి చెందిన వారే. ఆయన గురించి చాలా మందికి ఎన్టీఆర్ తనయుడుగానే తెలుసు కానీ ఆయన సినిమాలకు పనిచేసారనే విషయం తక్కువ మందికే తెలుసు. అయితే సినిమాల్లో నటించాలనే కోరిక మోహన కృష్ణకు లేదు. కానీ సినిమా పరిశ్రమలోనే ఉండాలని అనుకున్నారట. తండ్రి ఎన్టీఆర్ మోహన కృష్ణను మొదట హీరో చెయ్యాలని అనుకున్నా మోహన కృష్ణ గారికి ఇంట్రస్ట్ లేకపోవడంతో వద్దనుకుని ఆయన ఛాయాగ్రహకుడు అవ్వాలని అనుకునుటున్నట్లు చెప్పగానే ఒప్పుకున్నారట.
అలా అమెరికా వెళ్లి సినిమాటోగ్రఫీలో శిక్షణ తీసుకున్న మోహన కృష్ణ గారు ముందు అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి ఆ తరువాత డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసారు. తండ్రి సినిమాలకు అలాగే తమ్ముడు బాలకృష్ణ సినిమాలకు పనిచేసారు. ‘గొప్పింటి అల్లుడు’ సినిమా తరువాత మోహన కృష్ణ గారు సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడం దాదాపుగా ఆపేసారు. ప్రస్తుతం ఇతర వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఇక అయన భార్య నిర్మాత విశ్వేశ్వరయ్య గారి కూతురు. ఇక ఆయనకు తారక రత్న కాకుండా కూతురు మోహన రూప ఉన్నారు.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…