న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్. అంతే కాదు విభిన్న మైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. చివరిగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన వి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా నటించారు.
ఈ సినిమా పేక్షకులను అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. వరుస సినిమాలతో దూసుకు వస్తున్నాడు నాని. ఇప్పటికే శివ నిర్వాణం దర్శకత్వం వహిస్తున్న టక్ జగదీష్ సినిమా ను పూర్తి చేసాడు. ఏ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా తర్వాత టాక్సీ వాల ఫెమ్ రాహుల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా శ్యామ్ సింగరాయ్ అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేశారు.
ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘అంటే .. సుందరానికీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు నాని. ఇదిలా ఉంటే త్వరలో మరో సినిమాతో రాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరు కలిసి ‘భలే భలే మగాడివోయ్’ సినిమా చేసారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పుడు మళ్లీ అదే రేంజ్ లో వీళ్లీద్దరి కాంబోలో సినిమా రాబోతుందని అంటున్నారు. ఇక మారుతి ప్రస్తుతం గోపీచంద్ కథానాయకుడిగా ‘పక్కా కమర్షియల్’ సినిమాను రూపొందిస్తున్నాడు. తనదైన యాక్షన్ కామెడీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా ఆయన రాశి ఖన్నాను తీసుకున్నాడు. గోపిచంద్ తో సినిమా కంప్లీట్ అయ్యాక నాని తో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి…!!
అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే యువతలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. సాధారణ జీవితానికి భిన్నంగా ఉత్కంఠభరిత అనుభూతిని ఆస్వాదించాలనే కోరికతో వేలాది…
వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…