Will Jagan be arrested? Minister Nara Lokesh's sensational comments
అమరావతి: మంత్రి నారా లోకేష్ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి సింగపూర్ పర్యటన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన లిక్కర్ స్కామ్పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో జగన్ అరెస్ట్ అవుతారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, లోకేష్ “చట్టం తన పని తాను చేసుకుంటుంది” అని సమాధానమిచ్చారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లోకేష్ మాట్లాడుతూ, “మేమంతా రాష్ట్ర అభివృద్ధి కోసం పరుగు పెడుతుంటే, జగన్ తప్పుడు ఈ-మెయిల్స్ పెడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు ఆ రాష్ట్రానికే పరిమితం అవుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అభివృద్ధిని అడ్డుకునే ‘క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్’ నడుస్తోంది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే వారిని వదిలిపెట్టం, తప్పక చర్యలు తీసుకుంటాం” అని అన్నారు.
లిక్కర్ స్కామ్పై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. “ఒక లిక్కర్ కంపెనీ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు చేస్తుందా? లిక్కర్ కంపెనీకి బంగారం ఏమన్నా ముడి సరుకా? అదాన్ డిస్టిలరీ నుంచి పీఎల్ఆర్ కంపెనీకి డబ్బులు ఎందుకు వెళ్లాయి? దీనికి పెద్దిరెడ్డి సమాధానం చెప్పగలరా?” అని సవాల్ విసిరారు.
జగన్పై లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. “ఎమర్జెన్సీ వాతావరణం ఉందని చెబుతున్నారు. నిజంగా ఉంటే జగన్ బయటకు రావచ్చా? ఆయన హయాంలో చంద్రబాబు ఇంటి గేటుకు తాళాలు వేసి కట్టలేదా? తల్లి, చెల్లిపై కేసులు పెట్టి, ఆ కేసులో గెలిచామని సంబరాలు చేసుకోవడం జగన్కే సాధ్యం. తల్లి, చెల్లికి అన్యాయం చేసే వ్యక్తి అసలు నాయకుడిగా పనికివస్తారా?” అని ప్రశ్నించారు.
చివరగా లోకేష్ మాట్లాడుతూ, “జగన్ అభివృద్ధి చేయరు. చేసేవాళ్లను మాత్రమే అడ్డుకుంటారు. ఆయన వేసిన పాచికలు ఎక్కడా పడడం లేదు” అని వ్యాఖ్యానించారు. లోకేష్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…