Featured

రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. లక్ష రూపాయలు గెలుచుకునే ఛాన్స్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రైతులు ఏకంగా లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని మోదీ సర్కార్ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అగ్రి హ్యాకథన్ పేరుతో నూతన కార్యక్రమాన్ని లాంఛ్ చేసింది. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో కేంద్రం శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఆవిష్కరించారు.

దాదాపు 60 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుండగా 24 మంది విజేతలు ఈ స్కీమ్ ద్వారా లక్ష రూపాయలు గెలుపొందే అవకాశం ఉంటుంది. విజేతలకు నగదుతో పాటు రైతులకు ప్రయోజనం చేకూర్చే ఉత్పత్తుల తయారీ కోసం కేంద్రం నుంచి ఆర్థిక మద్దతు లభిస్తుంది. ఈ కార్యక్రమం వర్చువల్ కార్యక్రమం కాగా ఇండియన్ అగ్రికల్చర్ విభాగంలో జరుగుతున్న పెద్ద కార్యక్రమం ఇదే కావడం గమనార్హం.

ఆసక్తి ఉన్న రైతులు అగ్రి హ్యాకథాన్ 2020లో పాల్గొనవచ్చు. దేశంలోని వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ సమస్యలకు పరిష్కారం చెప్పడంతో పాటు ప్రస్తుతం రైతులు పొందుతున్న సేవలతో పోలిస్తే మెరుగైన సేవలను పొందడానికి అవసరమైన ఉత్పత్తులను తయారు చేసిన వాళ్లు, రైతుల శ్రమను తగ్గించే ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చేవారు అగ్రి హ్యాకథాన్ 2020లో పాల్గొనవచ్చు.

రైతులతో పాటు స్మార్ట్ ఇన్నోవేటర్లు, స్టార్టప్స్, యువత కూడా అగ్రి హ్యాకథాన్ 2020లో పాల్గొనవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా mygov.in వెబ్ సైట్ ద్వారా రైతులు రిజిష్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రైతులు ప్రశంసిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago