Naresh : రమ్య, నరేష్, పవిత్ర లోకేష్ ల వివాదం రోజురోజుకీ బాగా ముదురుతోంది. మీడియా కూడా ఇక వీళ్ళ ఇష్యూ వదిలేద్దామని అనుకున్నా మళ్ళీ ఎవరో ఒకరు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఇష్యూని ఇంకొంచం రసవత్తరం చేస్తున్నారు. ఇక వీళ్ళ విషయంలో బాగా హైలైట్ రమ్య, నరేష్ లు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు. నరేష్ తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. ఇక నరేష్ రమ్య తన కారు డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని, కన్నడ టీవీ ఛానల్ ఓనర్ తో ఉంటోందని ఘాటు వాఖ్యలు చేసాడు. ఇదిలా ఉంటే ఒకప్పుడు నరేష్ ఇంటర్వ్యూ లో రమ్య గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
బాల్య వివాహం జరిగింది… రమ్య చాలా మంచిది.. కుటుంబంలో అందరితో కలిసిపోయింది…
ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెల్ రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ లో నరేష్ ను ఇంటర్వ్యూ చేసాడు రాధాకృష్ణ. ఇక ఇంటర్వ్యూ లో తన మూడు పెళ్లిళ్ల గురించి చెప్పాడు నరేష్. మొదటి పెళ్లి చాలా చిన్న వయసులో అయిందని ఒకరకంగా అది బాల్యవివాహం అనొచ్చు అంటూ 19 ఏళ్లకే పెళ్లయిందని వివరించాడు. ఇక మొదటి భార్య కుటుంబంతో చాలా చక్కటి అనుబంధం ఉందని వివిధ కారణాలు, ఆరోగ్యసమస్యల వల్ల విడిపోయామని చెప్పాడు. ఇక మూడో భార్య రమ్య గురించి మాట్లాడుతూ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని, ఆధ్యాత్మికత వైపు వెళ్లానని, కానీ ఇంట్లో వాళ్ళు మల్లీ పెళ్లి చేసుకోమన్నారు. ఇక దేవుడు అలా నిర్ణయించాడు అందుకే చేసుకున్నా అని చెప్పాడు.
రమ్య గురించి చెబుతూ.. రమ్య చాలా మంచిది, కుటుంబంలో చక్కగా కలిసి పోతుంది అంటూ చెప్పారు తన వల్ల నేను నా సామాజిక పనులు కూడా చక్కగా చేసుకోగలుగుతున్నానని చెప్పాడు. ఇక ఇపుడు గొడవల తరువాత రమ్య కు డ్రైవర్ తో అక్రమ సంబంధం ఉందని, అలాగే కన్నడ టీవీ ఛానల్ ఓనర్ తో ఉంటోందని, ఎంతోమందిని డబ్బు తీసుకుని మోసం చేస్తే ఆ అవమానాలు, హింస భరించలేక విడాకులు తీసుకోవాలని అనుకున్నట్లు వివరించిన వీడియో రెండూ ప్రస్తుతం అప్పుడు, ఇప్పుడు అంటూ బాగా ట్రెండ్ అవుతున్నాయి.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్తో తన…
మనం రోజూ తీసుకునే మందుల విషయంలో చాలా చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం సాధారణం. ట్యాబ్లెట్ను నోట్లో వేసుకుని నీళ్లు…
చర్మంపై చిన్నచిన్న ముడతల్లా కనిపించే వార్ట్స్ (warts) చాలామందికి సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇవి సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా, కనిపించే…
చిన్నప్పటి నుంచి సినిమాల్లో అడుగుపెట్టి, తర్వాత హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో తేజస్వి మదివాడఒకరు. తెరపై చలాకీగా కనిపించే ఆమె…
ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డుల వేడుక సినీ ప్రముఖుల సందడితో అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్పై స్టాండప్ కామెడీ పేరుతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు…