Naga Chaitanya: తల్లిదండ్రుల పట్ల ఎమోషనల్ పోస్ట్ చేస్తూ థాంక్స్ చెప్పిన చైతూ.. సమంతను దరిద్రం అంటూ కామెంట్?
Naga Chaitanya: అక్కినేని యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య విక్రమ్ కే దర్శకత్వంలో నటించిన థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూలై 22వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ.. మీకు కష్ట సమయాలు వచ్చినప్పుడు మిమ్మల్ని విడవకుండా మీకు అండగా నిలిచిన వారికి థాంక్యూ చెప్పండి అంటూ #themagicwordisthankyou పేరుతో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి అభిమానులకు షేర్ చేశాడు.
ఇక నాగచైతన్య ఈ హ్యాష్ ట్యాగ్ షేర్ చేసే ముందు తన జీవితంలో తనకు ఎంతో అండగా నిలిచిన తన తల్లిదండ్రులకు థాంక్యూ చెప్పారు. ముందుగా నాగ చైతన్య తన తల్లితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ..అమ్మ – నా అంతరంగికంగా, ఎప్పటికప్పుడు నీవు నన్ను నిర్మించుకుంటూ నాలో భాగమైపోయావు అన్ని విధాలుగా నాకు తోడుగా ఉన్నందుకు థాంక్యూ అంటూ చెప్పుకొచ్చారు.
అదేవిధంగా తన తండ్రి నాగార్జున గురించి కూడా నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్ చేశారు. నాన్న నాకు దిశా నిర్దేశం చేసినందుకు, ఎవరు చేయలేని స్నేహాన్ని నాతో చేసినందుకు,నాకు మంచి స్నేహితుడిగా ఉన్నందుకు థాంక్యూ అంటూ ముందుగా నాగచైతన్య తన తల్లిదండ్రుల గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పోస్టులకు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఎంతో మంది అభిమానులు ఈ పోస్టుపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక అభిమాని సమంతను ఉద్దేశిస్తూ ఒకటి తగ్గింది అంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే మరొక నెటిజన్ ఈ కామెంట్ పై స్పందిస్తూ ఆ దరిద్రం తగ్గడమే మంచిది అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి నాగచైతన్య చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ కారణంగా కొందరు సమంతని భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే థాంక్యూ సినిమాలో నాగచైతన్య రాశిఖన్నా జంటగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచాయి.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…