Naresh & Pavithra Lokesh : నరేష్, పవిత్ర గత ఆరు నెలలుగా రమ్యను రెచ్చగొట్టాలని చూస్తున్నారు, హైదరాబాద్ లో నరేష్ కు సపోర్ట్ సిస్టం ఉంది : కృష్ణ కుమారి

Naresh & Pavithra Lokesh : పూటకో కొత్త మలుపు తిరుగుతూ సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్న నరేష్, రమ్య, పవిత్ర లోకేష్ ల విషయంలో నరేష్, పవిత్ర లోకేష్ లు మాకు సపోర్ట్ చేయండి అంటుంటే, రమ్య ఒక వైపున తన భర్త కు విడాకులు ఇవ్వను అంటూ రచ్చచేస్తోంది. ఇక ఈవిషయంలో నరేష్ కి సపోర్ట్ చేస్తూ చిట్టీ బాబు, శ్రీనివాసులు నరేష్ చెల్లి ఓల్డ్ సినిమా యాక్టర్ పూజిత వంటి వారు రమ్య మీద ఆరోపణలతో బయలుదేరగా రమ్య మైసూర్ హోటల్ లో ఒకే గదిలో నరేష్, పవిత్ర లోకేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పవిత్రను చెప్పుతో కొట్టబోయి నానా రచ్చ చేసింది.

రమ్య ను కావాలనే రెచ్చగొడుతున్నారు…

ఇక సామాజిక వేత్త కృష్ణ కుమారి ఈ మ్యాటర్ పై స్పందిస్తూ నరేష్ పవిత్ర లోకేష్ ను వాడుకుని రమ్య ను రెచ్చగొడుతున్నానంటూ అభిప్రాయ పడ్డారు. పవిత్ర లోకేష్, నరేష్ ల విషయంలో ఇప్పుడు కాదు జనవరి నుండే వాళ్ళు బయట కనిపించడం, గుడులు తిరగడం మొదలుపెట్టారు. అలా రమ్యను రెచ్చగొట్టడం వారి ప్లాన్, రమ్యకు విడాకుల నోటీసు జనవరిలోనే నరేష్ పంపాడు. పబ్లిక్ లో నెగెటివ్ వస్తుందనే భయం నరేష్ కి లేదు, తన చుట్టూ ఒక కోట ఉంది. ఆయన చేస్తోంది తప్పు కాదు అని ప్రచారం చేయడానికి మనుషులు ఉన్నారు. అందుకే అంత ధైర్యంగా ఆయన ఈ ఇష్యూ లో ఉన్నారు. ఇక ఆయనకు ఎవరైనా మద్దతు ఇవ్వవచ్చు కానీ రమ్య కి మద్దతుగా ఎవరైనా ఉంటే మాత్రం వారితో ఆమెకు సంబంధం అంటగడుతున్నారు.

రమ్య బెంగళూరు లో మీడియా ముందు మాట్లాడటాన్ని కూడా ఇష్యూ చేస్తున్నారు. ఆమె ఉండేది బెంగళూరులో కాబట్టి అక్కడ మాట్లాడింది, అలా అయితే మరి వెళ్లేందుకు ప్రెస్ మీట్లు హైదరాబాద్ లో పెడుతున్నారు, వీళ్ళు కూడా బెంగళూరు లో మాట్లాడొచ్చు కదా అంటూ కృష్ణ కుమారి ప్రశ్నించారు. సామరస్యంగా కూర్చొని వాళ్ళు చేసుకున్న ఆరోపణలకు సమాధానాలు వెతికితే పరిష్కారం దొరుకుతుంది. అంతేకాని ఇలా రోడ్డుకేక్కితే ఎలా అంటూ కృష్ణ కుమారి కామెంట్స్ చేసారు.