Naseer Ahmed gives clarity on Guntur TDP MLA's viral video..!
గుంటూరు: సోషల్ మీడియాలో తనపై వైరల్ అవుతున్న రాసలీలల వీడియోపై గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తీవ్రంగా స్పందించారు. ఈ వీడియో పూర్తిగా ఫేక్ అని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా చేసిన ప్రచారం అని ఆయన స్పష్టంచేశారు.
నసీర్ అహ్మద్ మాట్లాడుతూ, “ప్రజాప్రతినిధులపై తప్పుడు ఆరోపణలు చేయడానికి నకిలీ కంటెంట్ను వ్యాప్తి చేయడం రాజకీయ నైతికతకు విరుద్ధం. గుంటూరు ఈస్ట్లో 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా ఎగురుతుంటే చూడలేక ప్రతిపక్షాలు ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నాయి,” అని విమర్శించారు.
“సాక్షి ఛానల్ నిజాలను చూపించడానికేనా? లేక ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనా?” అని నసీర్ అహ్మద్ సూటిగా ప్రశ్నించారు. ఈ వీడియో నిజమని నిరూపించాలని ఆయన ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
ఈ వీడియోపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని, ఫోరెన్సిక్ నిపుణులతో వీడియోను పరిశీలించి, ఈ కుట్రలో భాగమైన వారందరిపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇలాంటి నీచపు చర్యలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు. చివరగా, ప్రజలకు పిలుపునిస్తూ, “ఇలాంటి నకిలీ ప్రచారాలను నమ్మవద్దు. నిజం వైపు నిలబడండి. ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు మానుకొని, చేతనైతే ప్రజల కోసం పనిచేయండి” అని నసీర్ అహ్మద్ సందేశం ఇచ్చారు.
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…
స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…
రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘ఫంకీ’ ఈరోజు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాలెంటైన్ వీక్ను…