Naveen: నవీన్ అంటే తెలియకపోవచ్చు కానీ సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ అంటే మాత్రం అందరూ తప్పక గుర్తుపట్టారు. ఈయన కెరియర్లో హీరోగా ఒకే ఒక సినిమాలో నటించారు. హీరోగా నవీన్ మెప్పించకపోవడంతో ఈయన దర్శకుడిగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఈయన సాయి ధరమ్ తేజ్ హీరోగా సత్య అనే షార్ట్ ఫిలింకి దర్శకుడిగా వ్యవహరించారు.
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఈయన వరుస ఇంటర్వ్యూలో హాజరవుతూ తన ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. తన నానమ్మ విజయనిర్మల చనిపోవడంతోనే ఆ జ్ఞాపకాలను మర్చిపోలేక అదే బాధలో ఉండే కృష్ణ గారు కూడా చనిపోయారు అంటూ నవీన్ తెలియచేశారు.
నానమ్మ చనిపోయిన తర్వాత మహేష్ బాబు గారు కృష్ణ గారిని తన ఇంటికి తీసుకెళ్లడానికి చాలా బ్రతిమలాడారు. కానీ అక్కడ 40 సంవత్సరాలు పాటు నాన్నమ్మతో కలిసి ఉన్నటువంటి కృష్ణ గారు ఆ జ్ఞాపకాలను విడిచి వెళ్లలేక అదే ఇంట్లోనే ఉండే వారిని నవీన్ తెలిపారు. ఇక కృష్ణ గారు మరణించిన తర్వాత మహేష్ బాబుతో నాకు మంచి బాండింగ్ ఉందని తెలిపారు.
ఇప్పటికి కూడా మహేష్ అన్న రెండు మూడు రోజులకు ఒకసారి కాల్ చేసి నాతో మాట్లాడతారని లేదా నేనైనా తనుకు చేస్తూ ఉంటానని నవీన్ తెలిపారు. ఇలా మహేష్ గారితో తనకు మంచి బాండింగ్ ఉందని నవీన్ తెలిపారు. ఇక రమ్య రఘుపతి గురించి కూడా మాట్లాడుతూ ఆమె నా వరకు చాలా మంచిగానే ఉండేదని ఎప్పుడు మాట్లాడిన మంచిగానే మాట్లాడించేవారు అంటూ ఈ సందర్భంగా నవీన్ తెలిపారు. నాన్నతో ఆమెకు ఉన్నటువంటి గొడవలు అది పూర్తిగా వారి వ్యక్తిగతం అని నా వరకు అయితే చాలా మంచిగా ఉండే వారని తెలిపారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…