Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో అవార్డు అందుకోవడంతో అభిమానులు తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి అవార్డులు ఎవరు అందుకోకపోవడం గమనార్హం.
ఇలా మొదటిసారి నేషనల్ అవార్డుకోవడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకున్నటువంటి ఈయన పక్కన నటించడం కోసం ఎంతో మంది హీరోయిన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే అల్లు అర్జున్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా కూడా కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఈయనతో నటించలేమంటూ ఏకంగా దండం పెట్టేస్తూ అవకాశాలను వదులుకుంటున్నారు.
ఈ విధంగా అల్లు అర్జున్ సినిమా నుంచి హీరోయిన్స్ తప్పుకోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్ ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో సమంత నటించి మెప్పించారు. అయితే సీక్వెల్ సినిమాలో కూడా ఇలాంటి స్పెషల్ సాంగ్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ సాంగ్ చేయడం కోసం సుకుమార్ ఇప్పటివరకు ముగ్గురు హీరోయిన్లను సంప్రదించారట.
ఇక ఈ పాటలో చేయడం కోసం ఈ ముగ్గురు స్టార్స్ కూడా రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. ఇలా రిజెక్ట్ చేయడానికి కారణం రెమ్యూనరేషన్ అని చెప్పాలి. పాన్ ఇండియా సినిమా అంటే ఐదు భాషలలో విడుదల అవుతుంది అలాంటి పాటలో చేయాలి అంటే భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు కానీ సుకుమార్ మాత్రం కోటి రూపాయలు ఇస్తానని చెప్పడంతో కొంతమంది రిజెక్ట్ చేశారని అలాగే మరికొందరు అల్లు అర్జున్ చేసే డాన్స్ స్పీడ్ కు మేము చేయలేము అంటూ కొందరు ఈ పాటలో నటించే అవకాశం వచ్చిన రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…