Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో అవార్డు అందుకోవడంతో అభిమానులు తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి అవార్డులు ఎవరు అందుకోకపోవడం గమనార్హం.
ఇలా మొదటిసారి నేషనల్ అవార్డుకోవడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకున్నటువంటి ఈయన పక్కన నటించడం కోసం ఎంతో మంది హీరోయిన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే అల్లు అర్జున్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా కూడా కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఈయనతో నటించలేమంటూ ఏకంగా దండం పెట్టేస్తూ అవకాశాలను వదులుకుంటున్నారు.
ఈ విధంగా అల్లు అర్జున్ సినిమా నుంచి హీరోయిన్స్ తప్పుకోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్ ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో సమంత నటించి మెప్పించారు. అయితే సీక్వెల్ సినిమాలో కూడా ఇలాంటి స్పెషల్ సాంగ్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ సాంగ్ చేయడం కోసం సుకుమార్ ఇప్పటివరకు ముగ్గురు హీరోయిన్లను సంప్రదించారట.
ఇక ఈ పాటలో చేయడం కోసం ఈ ముగ్గురు స్టార్స్ కూడా రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. ఇలా రిజెక్ట్ చేయడానికి కారణం రెమ్యూనరేషన్ అని చెప్పాలి. పాన్ ఇండియా సినిమా అంటే ఐదు భాషలలో విడుదల అవుతుంది అలాంటి పాటలో చేయాలి అంటే భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు కానీ సుకుమార్ మాత్రం కోటి రూపాయలు ఇస్తానని చెప్పడంతో కొంతమంది రిజెక్ట్ చేశారని అలాగే మరికొందరు అల్లు అర్జున్ చేసే డాన్స్ స్పీడ్ కు మేము చేయలేము అంటూ కొందరు ఈ పాటలో నటించే అవకాశం వచ్చిన రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…
భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…
ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…
వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…
వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…