Naveen: నవీన్ అంటే తెలియకపోవచ్చు కానీ సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ అంటే మాత్రం అందరూ తప్పక గుర్తుపట్టారు. ఈయన కెరియర్లో హీరోగా ఒకే ఒక సినిమాలో నటించారు. హీరోగా నవీన్ మెప్పించకపోవడంతో ఈయన దర్శకుడిగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఈయన సాయి ధరమ్ తేజ్ హీరోగా సత్య అనే షార్ట్ ఫిలింకి దర్శకుడిగా వ్యవహరించారు.
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఈయన వరుస ఇంటర్వ్యూలో హాజరవుతూ తన ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. తన నానమ్మ విజయనిర్మల చనిపోవడంతోనే ఆ జ్ఞాపకాలను మర్చిపోలేక అదే బాధలో ఉండే కృష్ణ గారు కూడా చనిపోయారు అంటూ నవీన్ తెలియచేశారు.
నానమ్మ చనిపోయిన తర్వాత మహేష్ బాబు గారు కృష్ణ గారిని తన ఇంటికి తీసుకెళ్లడానికి చాలా బ్రతిమలాడారు. కానీ అక్కడ 40 సంవత్సరాలు పాటు నాన్నమ్మతో కలిసి ఉన్నటువంటి కృష్ణ గారు ఆ జ్ఞాపకాలను విడిచి వెళ్లలేక అదే ఇంట్లోనే ఉండే వారిని నవీన్ తెలిపారు. ఇక కృష్ణ గారు మరణించిన తర్వాత మహేష్ బాబుతో నాకు మంచి బాండింగ్ ఉందని తెలిపారు.
ఇప్పటికి కూడా మహేష్ అన్న రెండు మూడు రోజులకు ఒకసారి కాల్ చేసి నాతో మాట్లాడతారని లేదా నేనైనా తనుకు చేస్తూ ఉంటానని నవీన్ తెలిపారు. ఇలా మహేష్ గారితో తనకు మంచి బాండింగ్ ఉందని నవీన్ తెలిపారు. ఇక రమ్య రఘుపతి గురించి కూడా మాట్లాడుతూ ఆమె నా వరకు చాలా మంచిగానే ఉండేదని ఎప్పుడు మాట్లాడిన మంచిగానే మాట్లాడించేవారు అంటూ ఈ సందర్భంగా నవీన్ తెలిపారు. నాన్నతో ఆమెకు ఉన్నటువంటి గొడవలు అది పూర్తిగా వారి వ్యక్తిగతం అని నా వరకు అయితే చాలా మంచిగా ఉండే వారని తెలిపారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…