Naveen murder Case : అబుల్లాపూర్ మెట్ లో జరిగిన బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ అనే యువకుడి హత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారింది. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపాడు హరిహర కృష్ణ అనే యువకుడు. తన ప్రియురాలు నిహారిక రెడ్డి తో చనువుగా ఉన్నాడన్న కోపంతో పార్టీకి అని పిలిచి అక్కడ గొడవ పడి దారుణంగా నవీన్ హత్య చేసి తల, మొండేం వేరు చేసి గుండెను మార్మాంగాలను అలానే వేళ్ళను సెపరేట్ చేసి ప్రియురాలికి వాట్సాప్ లో పంపాడు. అయితే ఈ కేసులో రోజుకో కొత్త కోణం బయటికి వస్తోంది. నిహారిక రెడ్డికి అలాగే హరిహర ఇద్దరికీ శిక్ష పడాలి అంటూ నవీన్ కుటుంబం కోరుకుంటోంది. ఇక నవీన్ కుటుంబానికి ప్రముఖుల పరామర్శలు జరుగుతున్నాయి.
నవీన్ కుటుంబాన్ని ఓదార్చిన అచ్చంపేట ఎమ్మెల్యే…
అత్యంత పాశవికంగా నవీన్ ను అతని స్నేహితుడే చంపేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపింది. ఒక అమ్మాయి కోసం తన స్నేహితుడిని హరిహర అది కూడా అత్యంత దారుణంగా చంపేశాడు. దీంతో నవీన్ కుటుంబ సభ్యులు కొడుకును ఇంత క్రూరంగా చంపిన వారిని వదలకూడదని, మాకు న్యాయం జరగాలంటూ కోరుతున్నారు.
నవీన్ కుటుంబానికి అటు ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల నుండి మద్దతు లభిస్తోంది. తాజాగా అచ్చంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బాలరాజు నవీన్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇక ఆయన నవీన్ తల్లిదండ్రులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వగా నవీన్ హత్యతో ప్రమేయం ఉన్న ఆ అమ్మాయి నిహారిక రెడ్డిని కూడా శిక్షించాలని డిమాండ్ చేసారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…