నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం జాతిరత్నాలు.. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు.. అబ్దుల్లా ఫరియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కి నూతన దర్శకుడు అనుదీప్ దర్శకుడు.. నాగ్ అశ్విన్ నిర్మాత.. వైజయంతి బ్యానర్ నుంచి చాల రోజుల తర్వాత వచ్చిన మంచి సినిమాగా ఈ చిత్రం రికార్డులకెక్కింది.. రిలీజ్ అయినరోజునుంచి ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది.. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తో తో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కి ఈ సినిమా హిట్ మంచి బూస్ట్ లాంటిది అని చెప్పొచ్చు.మొదటినుంచి ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేయడం, విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ కి రావడం ఇవన్నీ ఈ సినిమా కి మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి..ఉప్పెన, నాంది సినిమాల తర్వాత ఆ రేంజ్ లో టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే అంటే నమ్మాల్సిందే.. విడుదలై ఇన్ని రోజులవుతున్న ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తుందంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే తాజాగా ఈ చిత్ర సక్సెస్ సందర్భంగా చిత్ర బృందం ఇంటర్వ్యూ ఇచ్చింది.. ఆ ఇంటర్వ్యూ లో చిన్న సంఘటన చోటుచేసుకుంది.ఓ ప్రముఖ మీడియా ఛానల్ యాంకర్ మాత్రం పంచ్ వేయాలనుకుందో… నిజంగానో చెప్పిందో కానీ జాతి రత్నాల టీంకి దిమ్మతిరిగే పంచ్ వేసింది.జాతిరత్నాలు చూస్తూ తను 20 నిమిషాల పాటు నిద్రపోయానంటూ చెప్పి షాకిచ్చింది. ఈ మాట విన్న జాతిరత్నాలు షాకయ్యారు. వామ్మో… బ్లాక్ బస్టర్ చిత్రాన్ని చూసేందుకు వెళ్లి నిద్రపోయారంటే ఏదో కారణం వుండి వుంటుంది. ఆ సినిమాకు మీ ఆయన్ని కూడా తీసుకెళ్లారా అంటూ పవర్ పంచ్ వేశాడు నవీన్ పోలిశెట్టి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…