రాహుల్ సిప్లిగంజ్.. సింగర్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఇప్పుడు హీరో అయ్యేంతవరకు ఎదిగాడు.. బిగ్ బాస్ లో వచ్చిన ఫేమ్ ని వందకి వంద స్థం ఉపయోగించుకుంటూ ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు. ఇప్పటికే కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో నటిస్తున్న రాహుల్ ఇప్పుడు ఏకంగా హీరోగా చేయడం విశేషం..నిజానికి బిగ్ బాస్ లో పాల్గొన్న వారందరు లైఫ్ ఇప్పుడు మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ కంటే ముందు ఉన్న పాపులారిటీ కంటే ఆ తర్వాత వచ్చిన పాపులారిటీ వేరు.. ఎక్కడికెళ్లినా వారిని గుర్తుపడుతున్నారు.
సామాన్య వ్యక్తిగా వచ్చిన వారు కూడా సెలబ్రిటీ అయిపోవడం గత సీజన్ లలో మనం చూశాం.. ఎవరికీ వారు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకుని అందరిని ఫ్యాన్స్ ని చేసుకుంటున్నారు.. తెలుగు లో నాలుగు సీజన్ లు పూర్తవగా దాదాపు 80 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.. వీరిలో అందరు మంచి పాపులారిటీ తెచ్చుకోగా సీజన్ 3 లో అలరించిన రాహుల్ ఇప్పుడు హీరోగా చేయడం విశేషం..బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ మూలాన సింగర్ కాస్తా నటుడు అయ్యాడు. అలా వ్యాపార రంగంలోకి దిగి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మొత్తంగా హీరోగా మారిపోయాడు.
ఈ క్రమంలో తన ఊకో కాక బ్రాంచ్ను సిద్దిపేటలో ఘనంగా ప్రారంభించబోన్నాడు. ఈ సందర్భంగా తన కొత్త మూవీ ప్రకటన కూడా చేయబోతోన్నాడు. రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితుడితో కలిసి ఊకో కాక అనే మెన్సే వేర్ బిజినెస్ను ప్రారంభించాడు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఊకో కాకను ప్రమోట్ చేసేందుకు, అన్ని చోట్లా షోరూంలను ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే హైద్రాబాద్, దాని పరిసర ప్రాంతాలు, ఇతర జిల్లాల్లోనూ ఊకో కాకను ప్రారంభించాడు.ఇక మార్చి 19న సిద్దిపేటలో ఊకో కాకను రాహుల్ ప్రారంభించబోతోన్నాడు. ఈ ఈవెంట్కు మంత్రి హరీశ్ రావును ముఖ్య అతిథిగా పిలిచినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్లోనే హీరోగా రాబోతోన్న మూవీ టైటిల్, సినిమాలోని సాంగ్ను విడుదల చేయబోతోన్నట్టు తెలిపాడు. మొత్తానికి అటు వ్యాపారాన్ని, ఇటు సినీ కెరీర్ను రెండింటిని బ్యాలెన్స్ చేసేస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…