Nayanathara -Vignesh Shivan: ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచినటువంటి నయనతార విగ్నేష్ దంపతులు గురించి అందరికీ తెలిసిందే.పెళ్లయిన నాలుగు నెలలకే కవల పిల్లలకు జన్మనివ్వడంతో పెద్ద ఎత్తున ఈ విషయం విభాగంగా మారింది. ఈ క్రమంలోనే సరోగసికి సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వానికి సమర్పించడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది.
ఇలా కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార దంపతులు ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న అనంతరం మొదటిసారిగా తన పిల్లలతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు.ఈ క్రమంలోనే నయనతార దంపతులు ఇద్దరు వారి పిల్లలను ఎత్తుకొని ఎక్కడ తన పిల్లల మొహాలు కనపడకుండా జాగ్రత్త పడుతూ సాంప్రదాయ దుస్తులలో ఈ పండుగను జరుపుకున్నట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే పిల్లలతో కలిసి వీరు అభిమానులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా విగ్నేష్ శివన్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేస్తూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రతి సందర్భంలోనూ అందరూ సంతోషంగా ఉండాలి జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వాటిపై పోరాడండి.
ప్రేమ జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.. ప్రేమలో విశ్వాసం,మంచితనం ఎల్లప్పుడూ ఉండాలంటూ ఈ సందర్భంగా విగ్నేష్ నయనతార తన పిల్లలతో కలిసి దిగినటువంటి వీడియోనిషేర్ చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ 9వ తేదీ వివాహం చేసుకున్న ఈ దంపతులు అక్టోబర్ 9వ తేదీ కవల పిల్లలకు జన్మనిచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…