Balakrishna: సాధారణంగా ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు చేయడం సర్వసాధారణం ఈ క్రమంలోనే వివిధ భాషలలో మంచి విజయాలను అందుకున్న చిత్రాలను ఇతర భాషలలో రీమేక్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నందమూరి తారకరామారావు ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలు పౌరాణిక చిత్రాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఈయన బాటలోనే ఆయన వారసుడిగా నందమూరి నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మరిన్ని విజయాలను అందుకున్నారు.
ఇకపోతే ఎన్టీఆర్ నటించిన పలు క్లాసికల్ చిత్రాలను బాలకృష్ణ రీమేక్ చేశారు. మరి ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో బాలకృష్ణ ఏ ఏ సినిమాలను రీమేక్ చేశారో ఇక్కడ తెలుసుకుందాం…ఎన్టీఆర్ హీరోగా కమలకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన నర్తనశాల చిత్రాన్ని బాలకృష్ణ ‘శ్రీ మద్విరాట పర్వము’ పేరుతో రీమేక్ చేసారు.
అలాగే ఎన్టీఆర్ నటించిన వద్దంటే డబ్బు సినిమాని కొద్దిగా మార్పులు చేసి జంధ్యాల దర్శకత్వంలో బాబాయ్ అబ్బాయి అనే సినిమాని చేసి మంచి హిట్ అందుకున్నారు. అలాగే ఎన్టీఆర్ రాముడు భీముడు అనే సినిమాని బాలకృష్ణ కథలో కొన్ని మార్పులు చేసి రాముడు భీముడు అనే టైటిల్ తో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.
ఎన్టీఆర్ నటించిన గులేబకావళి కథ’, ‘జగదేకవీరునికథ’, ‘రాజపుత్ర రహస్యం’ వంటి సినిమాల నుంచి కొద్దిగా కథను తీసుకొని భైరవద్వీపం కథ తెరకెక్కించారు. బాలకృష్ణ సినీ కెరీయర్ లో భైరవద్వీపం మంచి హిట్ అందుకుంది.ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం సినిమానీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ పాండురంగడు సినిమాగా రీమేక్ చేశారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాండవీయం’ సినిమాలో కొంత భాగం ఆధారంగా చేసుకొని శ్రీకృష్ణార్జున విజయము అనే సినిమాని తెరకెక్కించారు. ఎన్టీఆర్ లవకుశ చిత్రాన్ని బాలకృష్ణ శ్రీరామరాజ్యంగా రీమేక్ చేశారు. అలాగే ఎన్టీఆర్ జీవిత కథాంశంతో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహా నాయుడు అనే సినిమాలలో కూడా బాలకృష్ణ నటించారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…