కార్తీకదీపం.. ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న ఈ సీరియల్ అత్యధిక టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతోంది. ఎన్నో ట్వీస్ట్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచి టీవీలకే అతుక్కుపోయేలా చేస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ సీరియల్కు అభిమానులు అయిపోయారు. అంతగా ప్రేక్షక ఆదరణ పొందిన ఈ సీరియల్.. లీడ్ పాత్రల మధ్య గొడవలు పెట్టించి సాగదీస్తున్నారు. అయితే తాజాగా ఓ ఎపిసోడ్ ప్రేక్షకులకు పెద్ద తలనొప్పిగా మారింది.
దర్శకుడు కనిపిస్తే కొట్టేయాలన్న కోపంతో ఉన్నారు నెటిజన్లు. కోర్టులో జరిగిన సీన్ చూస్తే అలానే అనిపిస్తుంది. మోనిత చినిపోయినట్లు .. కార్తీక్ జైలుకు వెళ్లడం.. కట్ చేస్తే.. మొత్తం ఫేక్ అని తెలిసి.. పోలీస్ ఆఫీసర్ రోషిని బలి చేయడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తం లాజిక్ మిస్ అవుతుందని.. అర్థం పర్థం లేకుండా డైరెక్టర్ కథను నడిపిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంత పెద్ద పోలీసు ఆఫీసర్ రోషిని సీసీ కెమెరాలు చెక్ చేయాలన్న ఆలోచన లేదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కార్తీక దీపం వల్ల రాత్రి ఇంటికి వెళ్తే తమకు అన్నం పెట్టడం లేదంటూ.. ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. లాజిక్ లేకుండా.. ఆసుపత్రిలో మోనిత పేషెంట్ కు నర్సు లేకుండా ఎలా చెక్ చేస్తుంది అంటూ.. మండిపడ్డాడు మరో నెటిజన్.
ఈ సీరియల్ చందమామ కథలు చిన్నపిల్లలకు చెప్పినట్టుగా ఉందంటూ కామెంట్ చేశారు. సీరియల్ ను పొడిగించాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారు తప్ప.. ఏ మాత్రం సీరియల్ లో పసలేదంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంత చేసినా.. ఎన్ని నెగెటివ్ కామెంట్లు పెట్టినా.. ఆ సీరియల్ కు వచ్చే రేటింగ్ వస్తూనే ఉంటుంది. నెగెటివ్ గా ఉండే వాళ్లు కూడా ఉంటూనే ఉంటారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…