Whatsapp: వాట్సాప్ లో కొత్త ఫీచర్..! ఇక ఆ సమస్య ఉండదు.. !
Whatsapp: వాట్సాప్ ప్రస్తుతం ఈ యాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు. నిత్య జీవితంలో వాట్సాప్ ఓ భాగంగా మారిపోయింది. సమాచారం షేర్ చేసుకోవలన్నా.. వ్యక్తులను కలపాలన్నా ఓ ప్రత్యేక యాప్ గా వాట్సాప్ ఉంది. అంతలా స్మార్ట్ ఫోన్ యూజర్లతో పెనవేసుకుంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో కూడా వాట్సాప్ కీలక భూమిక పోషిస్తోంది.
ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న వాట్సాప్ యాప్ ను ఎప్పటికప్పుడు కొత్తగా మరికొన్ని ఫీచర్లు తీసుకువస్తోంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంతకు ముందు ఉన్న ‘డిలీట్ ఎవ్రీ వన్’ ఆప్షన్ టైంను పెంచనుంది. వాట్సాప్ చేసిన తరువాత యూజర్ తన మేసేజ్ ను డిలీట్ చేసేందుకు డిలీట్ ఎవ్రీ వన్ ఆప్షన్ ను ఉపయోగిస్తుంటారు.
అయితే దీని టైమ్ లిమిట్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు కేవలం 1 గంట 8 నిమిషాల 16 సెకన్లు మాత్రమే టైమ్ లిమిట్ ఉండేది. ఇప్పుడు దీన్ని 2 రోజుల 12 గంటల వరకు టైమ్ లిమిట్ పెంచారు. దీంతో చాటా పేజీతో పాటు అవతలి వ్యక్తి చాట్ పేజీ నుంచి కూడా మెసేజ్ డిలీట్ చేయవచ్చు. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేలా వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాస్ బీటా ఇన్ఫో( వాబీటా ఇన్ఫో) తెలిపింది.
దీంతో పాటు గ్రూప్స్ కు భిన్నంగా కమ్యూనిటీ అనే కొత్త ఫీచర్ ను తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ను బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేలా వాబీటా ఇన్పో తెలిపింది. కమ్యూనిటీ ఫీచర్ పేరుతో వేరే గ్రూప్ లోకి ఒకేచోట చేర్చవచ్చు. అంతేకాకుండా ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్ కి మరిన్ని అదనపు ఫీచర్లతో ఇస్తుంది. అలాగే ఒక కమ్యూనిటీ లో వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వాటిక ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ రక్షణ ఉంటుంది. దీంతోపాటు కమ్యూనిటీ అడ్మిన్ గా ఉన్నవారు కమ్యూనిటీ లో ఉన్న అన్ని గ్రూపులకు మెసేజ్ పంపిచ్చు. గ్రూప్ లో లాగే కమ్యూనిటీ అడ్మిన్ లో ఇతరులను ఇన్వైట్ లింక్, క్యూఆర్ కోడ్ మాన్యువల్గా కమ్యూనిటీ లోకి ఆహ్వానించవచ్చు. అయితే కమ్యూనిటీ లోకి వచ్చిన కొత్త వ్యక్తి అన్ని గ్రూపులకు మెసేజ్ పంపలేరు. ఇది కమ్యూనిటీ అడ్మిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఇంట్లో తయారుచేసే ఆహారాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పనీర్ తయారీ కూడా చాలా మందికి అలవాటుగా మారుతోంది. బయట దొరికే…
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త డైట్ పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘వాటర్…
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…
ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…