Whatsapp: వాట్సాప్ లో కొత్త ఫీచర్..! ఇక ఆ సమస్య ఉండదు.. !
Whatsapp: వాట్సాప్ ప్రస్తుతం ఈ యాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు. నిత్య జీవితంలో వాట్సాప్ ఓ భాగంగా మారిపోయింది. సమాచారం షేర్ చేసుకోవలన్నా.. వ్యక్తులను కలపాలన్నా ఓ ప్రత్యేక యాప్ గా వాట్సాప్ ఉంది. అంతలా స్మార్ట్ ఫోన్ యూజర్లతో పెనవేసుకుంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో కూడా వాట్సాప్ కీలక భూమిక పోషిస్తోంది.
ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న వాట్సాప్ యాప్ ను ఎప్పటికప్పుడు కొత్తగా మరికొన్ని ఫీచర్లు తీసుకువస్తోంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంతకు ముందు ఉన్న ‘డిలీట్ ఎవ్రీ వన్’ ఆప్షన్ టైంను పెంచనుంది. వాట్సాప్ చేసిన తరువాత యూజర్ తన మేసేజ్ ను డిలీట్ చేసేందుకు డిలీట్ ఎవ్రీ వన్ ఆప్షన్ ను ఉపయోగిస్తుంటారు.
అయితే దీని టైమ్ లిమిట్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు కేవలం 1 గంట 8 నిమిషాల 16 సెకన్లు మాత్రమే టైమ్ లిమిట్ ఉండేది. ఇప్పుడు దీన్ని 2 రోజుల 12 గంటల వరకు టైమ్ లిమిట్ పెంచారు. దీంతో చాటా పేజీతో పాటు అవతలి వ్యక్తి చాట్ పేజీ నుంచి కూడా మెసేజ్ డిలీట్ చేయవచ్చు. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేలా వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాస్ బీటా ఇన్ఫో( వాబీటా ఇన్ఫో) తెలిపింది.
దీంతో పాటు గ్రూప్స్ కు భిన్నంగా కమ్యూనిటీ అనే కొత్త ఫీచర్ ను తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ను బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేలా వాబీటా ఇన్పో తెలిపింది. కమ్యూనిటీ ఫీచర్ పేరుతో వేరే గ్రూప్ లోకి ఒకేచోట చేర్చవచ్చు. అంతేకాకుండా ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్ కి మరిన్ని అదనపు ఫీచర్లతో ఇస్తుంది. అలాగే ఒక కమ్యూనిటీ లో వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వాటిక ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ రక్షణ ఉంటుంది. దీంతోపాటు కమ్యూనిటీ అడ్మిన్ గా ఉన్నవారు కమ్యూనిటీ లో ఉన్న అన్ని గ్రూపులకు మెసేజ్ పంపిచ్చు. గ్రూప్ లో లాగే కమ్యూనిటీ అడ్మిన్ లో ఇతరులను ఇన్వైట్ లింక్, క్యూఆర్ కోడ్ మాన్యువల్గా కమ్యూనిటీ లోకి ఆహ్వానించవచ్చు. అయితే కమ్యూనిటీ లోకి వచ్చిన కొత్త వ్యక్తి అన్ని గ్రూపులకు మెసేజ్ పంపలేరు. ఇది కమ్యూనిటీ అడ్మిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…