కరోనా నేపథ్యంలో దాదాపు 50 రోజుల లాక్ డౌన్ తరువాత మెల్ల మెల్లగా సడలింపులు ఇస్తున్నారు.. ఇప్పటికే రైల్యే శాఖ దేశ రాజధాని ఢిల్లీ నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విమానయాన ప్రయాణాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలను రూపొందిస్తున్నట్టు సమాచారం.
ఈ నిబంధనల్లో భాగంగా 80 ఏళ్ళు పైబడిన ఏ ప్రయాణికుడిని విమానాల్లోకి అనుమతించరు. ప్రయాణికుల క్యాబిన్ లగేజికి సంబంధించి కూడా కొన్ని కొత్త నిబంధనలను తీసుకువస్తుంది. ప్రయాణికుల క్యాబిన్ లగేజ్ 20 కేజీలకు మించకుండా ఉండాలని సూచిస్తున్నారు. అది కూడా ఒకే బ్యాగులో కాకుండా రెండు, మూడు బ్యాగులలో ఉండాలని సూచిస్తున్నారు. దీనికి తోడు వ్యక్తిగత దూరం పాటించేలా సీటింగ్ మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రయాణికులకు మధ్య వీలైనంత దూరం ఉంచేందుకు ప్రత్నిస్తున్నారు.
అంతేకాదు ప్రతి విమాన ప్రయాణికుడు తప్పని సరిగా ఆరోగ్యసేతు యాప్ ఇంస్టాల్ చేసుకోవాలి. ప్రయాణికుడు తప్పని సరిగా తన ఆరోగ్య వివరాలు చెప్పాల్సి ఉంటుంది. గత నెలరోజుల్లో కరోనా చికిత్స తీసుకున్నారా? వంటి వివరాలు తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. అయితే అధికారిక ట్యాక్సీలను మాత్రమే విమానాశ్రయాలకు రావాల్సి ఉంటుంది. అందువల్ల రెండుగంటల ముందుగానే ఎయిర్ పోర్ట్ లోనికి అనుమతిస్తారు. ప్రయాణ సమయానికి గంట ముందు మాత్రమే బోర్డింగ్ కు అనుమతిస్తారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…