సాధారణంగా విదేశాలలో అధ్యక్ష హోదాలో ఉన్నవారు, వీవీఐపీలు ప్రత్యేకంగా అన్ని వసతులతో, రక్షణాపరమైన సమస్యలు లేని విమానాలలో ప్రయాణిస్తుంటారనే సంగతి తెలిసిందే. అలా మన దేశంలోని వీవీఐపీలను కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్నో ప్రత్యేకలతో తయారు చేసిన ఎయిర్ ఇండియా వన్ విమానం మన దేశానికి చేరుకుంది. పౌర విమానయాన శాఖ అధికారులు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు టెక్సాస్ నుంచి ఢిల్లీకు ఈ విమానం చేరుకుందని వెల్లడించారు.
దేశానికి చేరుకున్న ఈ ప్రత్యేక విమానం ద్వారానే ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇతర దేశాలకు ప్రయాణం చేయనున్నారు. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థను కలిగి ఉన్న ఈ విమానంలో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఎలాంటి క్షిపణి దాడులనైనా ఈ విమానం తట్టుకోగలదు. ఈ విమానంలో ఆకాశంలో విహరిస్తూనే సులువుగా ఆడియో, వీడియో కమ్యూనికేషన్ చేయవచ్చు.
డల్లాస్ లో తయారైన బోయింగ్ 777 విమానాన్నే ప్రధాని వాడనున్నారు. కేంద్రం రెండు విమానాలను కొన్ని నెలల క్రితమే ఆర్డర్ చేయగా జులైలో ఈ విమానాలు భారత్ కు రావాల్సి ఉంది. అయితే కరోనా, లాక్ డౌన్, ఇతర సమస్యల వల్ల ఈ నెలలో భారత్ కు చేరుకుంది. రెండు మూడు రోజుల్లో మరో విమానం భారత్ కు చేరుకోనుందని తెలుస్తోంది. ఈ విమానం ప్రత్యేకతల విషయానికి వస్తే ఈ విమానంలో సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ (ఎస్పీఎస్), లార్జ్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ఫ్రేర్డ్ కౌంటర్మెజర్స్ (ఎల్ఏఐఆర్సీఎం) ఉన్నాయి.
ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుని విమానంలో మాత్రమే ఎస్పీఎస్ ఉండగా ఆ ఘనత సాధించిన మరో విమానంగా ఎయిర్ ఇండియా వన్ గుర్తింపు తెచ్చుకుంది. గంటకు 900 మీటర్ల వేగంతో ప్రయాణించే ఈ విమానంలో ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేయవచ్చు. ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ లా పని చేసే ఈ విమానంలో ప్రధాని కార్యాలయంతో పాటు సమావేశాల నిర్వహణ కోసం పెద్ద హాల్ ఉంది.
భారత వాయుసేన పైలెట్లు నడిపే ఈ విమానాల తయారీకి 8,400 కోట్ల రూపాయలు ఖర్చైంది. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ విమానాల బాధ్యతలను నిర్వర్తించనుంది. ఈ విమానానికి గాలిలో ఇంధానాన్ని నింపే సామర్థ్యం కూడా ఉండటం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…