Nidhi Agarwal: ఈ మధ్యకాలంలో ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి పేరు పెద్ద ఎత్తున మారుమోగిపోతుంది.సినిమా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఈయన తరచూ వార్తలు నిలుస్తున్నారు. అయితే ఈయన చెప్పినటువంటి విషయాలు నిజం కావడంతో ఈయన ఎంతో పాపులర్ అయ్యారు.వేణు స్వామి చెప్పినటువంటి మాటలు నిజమవుతున్నటువంటి తరుణంలో ఎంతో మంది సెలబ్రిటీలు కలిసి వారి జాతకం చూపించుకోవడమే కాకుండా జాతకంలో దోషాలు ఉంటే పరిహారాలు కూడా చేయించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి రష్మిక వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే. పూజలు చేయించుకున్న అనంతరం కెరియర్ పరంగా రష్మిక ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈమె బాటలోనే నటి నిధి అగర్వాల్ సైతం వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా నిధి అగర్వాల్ ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ రాకపోవడంతో ఈమె ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం కోసం వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారు.
ఈమె పూజ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వేణు స్వామి చేత పూజ చేయించుకున్నటువంటి నిధి అగర్వాల్ కు ఆ పూజలు ఫలించాయని తెలుస్తుంది. ఇన్ని రోజులు అవకాశాలు లేక ఉన్నటువంటి ఈమెకు దర్శకుల స్వయంగా ఫోన్ చేసి సినిమా అవకాశాలు ఇస్తున్నారట. ఈ క్రమంలోనే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
ఈ ముగ్గురిలో ఒకరిగా నటి శ్రీ లీల నటించే అవకాశం అందుకుందంటూ వార్తలు వినిపించగా ప్రభాస్ మాత్రం ఆమెను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.శ్రీ లీల ప్రభాస్ పక్కన మరీ పొట్టిగా ఉండడంతో ప్రభాస్ ఆమెను రిజెక్ట్ చేశారట అయితే శ్రీ లీల స్థానంలో ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో మారుతి నిధి పేరును సజెస్ట్ చేయడమే కాకుండా ఆమెకు ఫోన్ చేసి మరి అవకాశం కల్పించారని తెలుస్తుంది. ఇలా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వేణు స్వామి పూజలు ఫలించాయంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…