Niharika: మెగా డాటర్ నిహారిక పేరు గత కొంతకాలంగా తరచు వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా నిహారిక విడాకుల వార్తలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. జొన్నలగడ్డ వెంకట చైతన్యని వివాహం చేసుకున్న నిహారిక గత కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడమే కాకుండా వారి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయటంతో వీరి విడాకులు వార్తలకు మరింత బలం చేకూరింది. ఇలా విడాకుల గురించి రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ నిహారిక మాత్రం తన కెరీర్ మీద దృష్టి పెట్టింది. పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన నిహారిక ఇటీవల కొత్త ఆఫీసు కూడా ప్రారంభించింది. ఇక నిహారిక నటించిన ‘ డెడ్ పిక్సెల్స్ ‘ అనే వెబ్ సిరీస్ మే 19వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదలైన ట్రైలర్ అంచనాలను పెంచింది.ఈ వెబ్ సిరీస్ లో గాయత్రి అనే పాత్రలో నిహారిక కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో నిహారిక పాల్గొనింది. ఈ క్రమంలో విడాకుల గురించి నిహారిక కి ప్రశ్న ఎదురయింది. జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజా నిజాలు ఏంటి అని నిహారికను ప్రశ్నించగా…ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నిహారిక దాటవేసింది.
ఇలా విడాకుల వార్తలు గురించి నిహారిక మౌనం వహించటంతో ఈ వార్తలలో నిజం ఉందని నమ్ముతున్నారు. ఒకవేళ తన భర్తతో విడాకులు తీసుకోకపోతే నిహారిక ఈ వార్తలను ఖండించేదని , ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి నిహారిక మౌనంగా ఈ ప్రశ్నను దాటవేసిందని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు కూతురి గురించి ఏ చిన్న వార్త బయటికి వచ్చిన స్పందించే నాగబాబు ఇన్ని రోజులుగా కూతురి విడాకులు వార్తలు వినిపిస్తున్నప్పటికీ నాగబాబు స్పందించకపోవడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది
మనం రోజూ తీసుకునే మందుల విషయంలో చాలా చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం సాధారణం. ట్యాబ్లెట్ను నోట్లో వేసుకుని నీళ్లు…
చర్మంపై చిన్నచిన్న ముడతల్లా కనిపించే వార్ట్స్ (warts) చాలామందికి సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇవి సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా, కనిపించే…
చిన్నప్పటి నుంచి సినిమాల్లో అడుగుపెట్టి, తర్వాత హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో తేజస్వి మదివాడఒకరు. తెరపై చలాకీగా కనిపించే ఆమె…
ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డుల వేడుక సినీ ప్రముఖుల సందడితో అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్పై స్టాండప్ కామెడీ పేరుతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు…
తెలుగు ప్రేక్షకులకు ‘దేశముదురు’ సినిమాతో పరిచయమైన అందాల హన్సిక మోత్వాని, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తన…