Niharika: మెగా డాటర్ నిహారిక పేరు గత కొంతకాలంగా తరచు వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా నిహారిక విడాకుల వార్తలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. జొన్నలగడ్డ వెంకట చైతన్యని వివాహం చేసుకున్న నిహారిక గత కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడమే కాకుండా వారి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయటంతో వీరి విడాకులు వార్తలకు మరింత బలం చేకూరింది. ఇలా విడాకుల గురించి రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ నిహారిక మాత్రం తన కెరీర్ మీద దృష్టి పెట్టింది. పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన నిహారిక ఇటీవల కొత్త ఆఫీసు కూడా ప్రారంభించింది. ఇక నిహారిక నటించిన ‘ డెడ్ పిక్సెల్స్ ‘ అనే వెబ్ సిరీస్ మే 19వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదలైన ట్రైలర్ అంచనాలను పెంచింది.ఈ వెబ్ సిరీస్ లో గాయత్రి అనే పాత్రలో నిహారిక కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో నిహారిక పాల్గొనింది. ఈ క్రమంలో విడాకుల గురించి నిహారిక కి ప్రశ్న ఎదురయింది. జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజా నిజాలు ఏంటి అని నిహారికను ప్రశ్నించగా…ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నిహారిక దాటవేసింది.
ఇలా విడాకుల వార్తలు గురించి నిహారిక మౌనం వహించటంతో ఈ వార్తలలో నిజం ఉందని నమ్ముతున్నారు. ఒకవేళ తన భర్తతో విడాకులు తీసుకోకపోతే నిహారిక ఈ వార్తలను ఖండించేదని , ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి నిహారిక మౌనంగా ఈ ప్రశ్నను దాటవేసిందని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు కూతురి గురించి ఏ చిన్న వార్త బయటికి వచ్చిన స్పందించే నాగబాబు ఇన్ని రోజులుగా కూతురి విడాకులు వార్తలు వినిపిస్తున్నప్పటికీ నాగబాబు స్పందించకపోవడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…