ఎస్ బ్యాంక్ సంక్షోభం ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో డిపాజిటర్లు, ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తమ డబ్బులు వస్తాయో లేదో ? బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదు పరిస్థితి ఏంటి ? అనే అనేక సందేహాలతో ఆందోలనలో పడ్డారు ఖాతాదారులు. పలురకాల సందేహాలతో ఉన్న ఎస్ బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చారు.
ఎస్ బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో ఉన్న నగదుపై ఎటువంటి సందేహాలు పడవద్దని. అకౌంట్లలో ఉన్న నగదు సురక్షితంగా ఉంటుందని స్పష్టం చేసారు. అనేక ఆర్ధిక సమస్యలలో కూరుకుపోయిన ఎస్ బ్యాంకును గట్టెకించేలా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తో చర్చించినట్టు తెలిపారు. ఈ విషయంలో ఆర్బీఐ అధికారులు పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రభుతం, ఆర్బీఐ కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు.
అకౌంట్ హోల్డర్ల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు ఆర్ధిక మంత్రి. ఈ విషయంపై ఖాతాదారులు ఎంటువంటి ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. అయితే ప్రస్తుతం 50 వేల నగదు డ్రా చేసుకుందుకు అవకాశం కల్పించామని తెలిపారు. బ్యాంకు మరియు దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రయోజనాలను ద్రుష్టి లో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు నిర్మల సీతారామన్.
వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…