బుల్లితెరపై జంటగా నటించిన ఎంతోమంది నటీనటులు నిజ జీవితంలో మూడుముళ్ల బంధం ద్వారా ఎంతోమంది ఒక్కటయ్యారు. అలాంటి జంటలలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జంట పరిటాల నిరుపమ్, మంజుల జంట ఒకటి అని చెప్పవచ్చు. ఈటీవీలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ ద్వారా తమ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ జంట చివరకు మూడుముళ్ల బంధం ద్వారా వారి ప్రయాణం కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్నో సీరియల్స్ నటిస్తూ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఇక మంజుల సైతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే నటి మంజుల సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానాలను తెలియజేశారు. ఎక్కువ మంది నెటిజన్లు తన భర్త నిరుపమ్ గురించి తన చెల్లి కీర్తి గురించి ప్రశ్నలు అడిగారు. ఇక ఓ నెటిజన్ ఏకంగా నటి మంజులను తన ఫోన్ నెంబర్ అడగడంతో క్షణం కూడా ఆలోచించకుండా మంజుల తన ఫోన్ నెంబర్ ఇచ్చారు.
ఈ విధంగా మంజుల ఫోన్ నెంబర్ ఇవ్వడంతో నెటిజన్లు ఎంతో కంగుతిన్నారు. అయితే మంజుల ఇచ్చినది సెల్ ఫోన్ నెంబర్ ఏ కాదని అది తొమ్మిది నుంచి మొదలవుతుంది వరుసగా 0 వరకు రాసుకొచ్చారు. ఈ విధంగా ఫోన్ నెంబర్ రూపంలో ఉన్న నెంబర్ ను ఇవ్వడంతో నెటిజన్లు ఈమె తెలివితేటలకు ఆశ్చర్యపోతున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…