ntpc-eet-recruitment-2021-apply-for-50-female-engineering-executive-trainee-posts
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) నిరుద్యోగ మహిళలకు శుభవార్త తెలియజేసింది. ఈ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థలో ఖాళీగా ఉన్న 50 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ (ఈటీటీ) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి, అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలయింది. మే 6 దరఖాస్తుల స్వీకరణ చివరితేదీ.
ఎన్టీపీసీ విడుదల చేసిన ఈ పోస్టులు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను గేట్-2021 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ కేవలం మహిళలకు మాత్రమే అవకాశం కల్పించింది. మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంగా నోటిఫికేషన్లో పేర్కొనబడింది.
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న మహిళలు సంబంధిత ఈ విభాగంలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాలలోపు ఉన్న వారు మాత్రమే అర్హులు. దరఖాస్తు ఏప్రిల్ 16న 2021 ప్రారంభం కాగా, మే 6 2021 చివరి తేదీ. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు సంబంధిత అధికారిక వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం https://ntpccareers.net/ అధికారిక వెబ్ సైట్ నుంచి పొందవచ్చు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…