NTR: నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తన తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇంతకాలం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.
ఎన్టీఆర్ నటనకు మన దేశీయ దిగ్గజాలు మాత్రమే కాకుండా హాలీవుడ్ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ తో కలిసి పని చేయటానికి ఆసక్తి చూపుతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ థర్టీ సినిమా షూటింగ్ పనులలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత నీల్ తో కలిసి మరొక సినిమాలో చేయనున్నాడు. ఆ తర్వాత బుల్లితెర మీద హోస్ట్ గా సందడి చేయనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే ఎవరు మీలో కోటీశ్వరుడు, బిగ్ బాస్ సీజన్ వన్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ వన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని సక్సెస్ అయ్యింది .ఇక అప్పటినుండి ఎన్టీఆర్ బుల్లితెర మీద ఎక్కడా కనిపించలేదు. ఇక మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెర మీద సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ తొందర్లోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్న షో గురించి పూర్తి వివరాలు తెలియాలంటే కొంతకాలం ఆగక తప్పదు. అయితే ఎన్టీఆర్ మరొకసారి ఇలా బుల్లితెర మీద సందడి చేయబోతున్నాడు అనే విషయం తెలియగానే ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…