Categories: FeaturedGeneral News

మరో సారి వైరల్ గా మారిన పోస్టల్ స్టాంపులు.. ఫిదా అవుతోన్న నెటిజన్లు..!

రేపు అనగా ఆగస్టు 15. బారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 75 ఏళ్లు. అంటే 74 ఏళ్లు పూర్తి చేసుకొని 75లోకి అడుగుపెడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు దేశభక్తిలోకి వెళ్లిపోయారు. 1947 సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో రిలీజ్ అయిన పోస్టేజ్ స్టాంపును ఇప్పుడు షేర్ చేసుకుంటూ… దేశభక్తిని చాటుకుంటున్నారు.

దీంతో ఆ పోస్టల్ స్టాంప్ వైరల్ గా మారింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్… అప్పటి స్టాంపును ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా ఈ స్టాంపును రిలీజ్ చేశారని తెలిపారు. ఈ పోస్టల్ స్టాంప్ కాస్త ఆసక్తి కరంగా ఉంది. మువ్వన్నెల జెండా దీనిలో రెపరెపలాడుతూ కనిపించింది. అందులో ఉన్న బొమ్మ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. మెట్లు ఎక్కి పైకి వచ్చి… జెండా ఆవిష్కరించినట్లుగా ఆ బొమ్మ ఉంది. దానిపై 15 ఆగస్ట్ 1947 అని కూడా రాశారు. జైహింద్ అని దేశ ఐక్యతను చాటేలా హిందీ అక్షరాలతో రాశారు.

స్వాతంత్ర్యం సిద్దించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవం జరుపుతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్యాంపెయిన్ మార్చి 12న ప్రారంభమైంది. ఇది వచ్చే సంవత్సరం ఆగస్టు 15 నాటికి ముగుస్తుంది. ఈ స్టాంప్ ను 1947 నవంబర్ 21న విడుదల చేశారు.ఈ స్టాంపును అప్పట్లో దాని విలువ మూడున్నర అణాలుగా ఉండేది. వేరే దేశస్థుల కోసం దీనిని తయారు చేశారు. 1947 డిసెంబర్ 15న రెండో స్టాంపును దేశీయ అసరాల కోసం విడుదల చేశారు. దానిని అశోక లయన్ క్యాపిటల్ అని పిలిచారు.

దాని విలువ ఒకటిన్నర అణా. వీటిలాగానే మరో స్టాంపును 1947 డిసెంబర్ 15నే రిలీజ్ చేశారు. దానిపై ఎగిరే విమానం ఉంది. రెండు స్టాంపులను చూపిస్తూ కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్ ట్వీట్ చేశారు. వీటిని మహాత్మాగాంధీ 1930 దండి మార్చ్, ఉప్పు సత్యాగ్రహాన్ని స్మరిస్తూ… 1980లో వాటిని రిలీజ్ చేసినట్లు తెలిపారు. ఇలా పలు రకాల స్టాంపులను మంత్రి ట్విట్టర్ ద్వారా చూపించారు. దీంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

21 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

22 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

22 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

22 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

22 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

22 hours ago