Oscar Award Nominations2023: చిత్ర పరిశ్రమలో ఎన్నో అవార్డులను అందిస్తూ ఉంటారు. అయితే చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేస్తుంటారు. ఇక ఏడాది ఆస్కార్ అవార్డు నామినేషన్ లో భాగంగా తెలుగు సినిమా నామినేషన్స్ లోకి వెళ్లడం తెలుగు చిత్ర పరిశ్రమకే ఎంతో గర్వకారణం.
దాదాపు 22 సంవత్సరాలు తర్వాత ఆస్కార్ నామినేషన్ లో భారతీయ చిత్రానికి అవకాశం దక్కింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమాలోని ఒరిజినల్ సాంగ్ కేటగిరి భాగంలో నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ లో నిలిచింది. ఇలా ఈ పాట ఆస్కార్ నామినేషన్ లో ఉండడంతో చిత్ర బృందంతో పాటు ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
ఇక ఆస్కార్ నామినేషన్ లో భాగంగా నాటు నాటు సాంగ్ నిలవడంతో చిత్ర బృందం ఈ విషయంపై స్పందిస్తూ.. సరికొత్త చరిత్ర సృష్టించాం అంటూ పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడం విశేషం ఇలా గతంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న వారు ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు.
ఏడాది జరగబోతున్న 95వ ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో భాగంగా నాటు నాటు సాంగ్ నామినేట్ అయింది. ఇక ఈ అవార్డులను మార్చి 13వ తేదీ ప్రకటించనున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇండియా నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు ఆస్కార్ నామినేషన్ లో చోటు సంపాదించుకున్నాయి. మొత్తానికి ఆస్కార్ నామినేషన్ లో భాగంగా మూడు భారతీయ సినిమాలు నామినేట్ కావడం విశేషం.
ఇంట్లో తయారుచేసే ఆహారాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పనీర్ తయారీ కూడా చాలా మందికి అలవాటుగా మారుతోంది. బయట దొరికే…
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త డైట్ పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘వాటర్…
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…
ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…