Balakrishna: బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో తెలిసి మాట్లాడారా లేక పొరపాటుగా మాట్లాడారో తెలియదు కానీ అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. అది కూడా అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి రోజున అక్కినేని ఫ్యామిలీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అక్కినేని అభిమానులు బాలయ్య పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీ గురించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై అక్కినేని హీరోలు నాగచైతన్య అఖిల్ స్పందించిన విషయం మనకు తెలిసిందే . ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వర రావు ఈ విషయంపై స్పందించారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ బాలకృష్ణ వేదికపై గొప్ప నటుల గురించి ఇలా జోక్ చేస్తూ మాట్లాడాలనుకోవడం చాలా తప్పు. గతంలో ఎన్నోసార్లు బాలకృష్ణ ఏఎన్నార్ గురించి ప్రస్తావిస్తూ తనకు ఏఎన్ఆర్ బాబాయ్ లాంటివారని చెప్పుకొచ్చారని సర్వేశ్వరరావు గుర్తు చేశారు. అయినా ఏఎన్నార్ వర్ధంతి రోజున వీర సింహారెడ్డి సక్సెస్ మీద పెట్టుకోవడం ఏంటి అని ప్రశ్నించారు.
ఒకవేళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నాగేశ్వరరావు వర్ధంతి కావడంతో రెండు నిమిషాల పాటు మౌనం వహించి ఆయనకు నివాళులు అర్పించాల్సింది.తారక రామారావు గురించి అలాగే నందమూరి హీరోల గురించి నాగార్జున ఎప్పుడు కించపరిచే విధంగా మాట్లాడలేదు అంటూ సర్వేశ్వరరావు బాలయ్య వ్యాఖ్యలపై స్పందించి కామెంట్లు చేశారు. బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని అభిమానులు భావించగా మరికొందరు క్షమాపణలు చెప్పకపోయినా పర్వాలేదు అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలైన వివరించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…