General News

ఆ బాంబు బ్లాస్ట్ వెనుక భారత్ హస్తం ఉందంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్!

గత నెల 23న పాకిస్థాన్ లోని లాహోర్ ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ బాంబు దాడిలో ముగ్గురు మరణించగా 24 మంది తీవ్రంగా గాయపడినట్లు పాక్ మీడియా సంస్థలు తెలియజేశాయి. అయితే ఈ విధంగా పాకిస్తాన్ లో బాంబు బ్లాస్ట్ కావడానికి ఇండియా పాత్ర ఉందని పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ బాంబు దాడి వెనుక ఇండియా హస్తముందని,పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మోయీద్ యూసుఫ్ ఆరోపించారు. ఆదివారం ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలిపారు.

పాకిస్తాన్ లో జరిగిన ఈ ఘటన భారత ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని ఆయన ఆరోపించారు.అయితే ఈ బాంబు ఘటనలో నిందితులను అరెస్టు చేసే వారి దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, ఆ వస్తువులను ఫోరెన్సిక్ నిపుణులను విశ్లేషిస్తే సంచలన విషయాలు బయట పడ్డాయి ఈ సందర్భంగా యూసఫ్ తెలిపారు.

అయితే ఈ బాంబు దాడి వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అతని వివరాలను మాత్రం చెప్పకపోగా త్వరలోనే ఈ దాడి వెనుక ఉన్న వారు ఎవరు అనే విషయాలను పూర్తిగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. అయితే ఈ బాంబు 2008వ సంవత్సరంలో ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో పేలుడు సంభవించింది.హఫీజ్ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు వాహనాన్ని ఆపి వెళ్లగా కొద్దిసేపటికే బాంబు పేలింది అని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో హఫీజ్ తప్పించుకున్నారు.

ముంబై పేలుళ్ల సూత్రధారిగా మారిన హఫీజ్ ను ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు. యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ కూడా అతడిని టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. హఫీజ్ సయీద్‌ తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది. ఐనప్పటికీ అతడికి పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని ఇండియాతో పాటు అమెరికా వంటి దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

10 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

11 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

18 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

19 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

19 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago