Categories: FeaturedGeneral News

ఇకపై 57 ఏళ్లు దాటిన వారందరికీ ఆసరా పెన్షన్.. ఆదేశాలు జారీ చేసిన సీఎం!

తెలంగాణలో ఇకపై 57 సంవత్సరాలు దాటిన వారందరికీ ఆసరా పెన్షన్ అందించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో 60 సంవత్సరాలు వచ్చిన వారందరికీ ఆసరా పెన్షన్ కింద 2116 రూపాయలను అందిస్తున్నారు. ఇకపై ఈ పెన్షన్ 57 సంవత్సరాలు ఉన్న వారందరికీ కూడా వర్తిస్తుందని ఆదివారం ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.

గత ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు 57 సంవత్సరాలు ఉన్న వారందరికీ వచ్చే నెల నుంచి ఆసరా పెన్షన్ అందనుంది. ఈ పెన్షన్ పొందడానికి 57 సంవత్సరాలు నిండిన వారందరికీ ఆసరా కింద 2116 లను అందించనున్నారు. ఓటర్ కార్డ్ పై ఉన్న పుట్టిన తేదీ ని ఆధారంగా చేసుకొని పెన్షన్ అందించనున్నారు. ఈ క్రమంలోనే ఈ పెన్షన్ కు దరఖాస్తు చేసుకొని అభ్యర్థికి మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాని 3ఎకరాలకు మించి ఉండకూడదు.

అదేవిధంగా గ్రామాలలో వార్షిక ఆదాయం 1.5 లక్షలు పట్టణాలలో రెండు లక్షలకు మించి ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, వ్యాపారంలో అధిక లాభం పొందే వారు ఈ పథకానికి అనర్హులు. అలాగే డాక్టర్లు,కాంట్రాక్టర్లు వంటి అధిక ఆదాయం కలిగి ఉండి వారి సంతానం పై ఆధారపడుతున్న తల్లిదండ్రులకు కూడా ఈ పథకం వర్తించదు. ఎవరి పేరుమీద నైతే హెవీ వెహికల్స్ ఉంటాయో అలాంటి వారు కూడా అనర్హులుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం వితంతువులు 60 సంవత్సరాలు పైబడిన వారు, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వంటి వారికి ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకం కింద 2,116 రూపాయలను అందిస్తోంది. దివ్యాంగులకు 3,116 రూపాయలను అందిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…

26 minutes ago

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…

34 minutes ago

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…

38 minutes ago

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

2 hours ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

2 hours ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

2 hours ago