Pavithra Lokesh: నా భర్త చాలా మంచివాడు.. మొదటి భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పవిత్ర లోకేష్!
Pavithra Lokesh: కన్నడ నటిగా పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పవిత్ర లోకేష్ గురించి అందరికీ తెలిసిందే. అయితే తన భర్త నుంచి విడిపోయిన తర్వాత సీనియర్ నటుడు నరేష్ తో సహజీవనం చేస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో జంటగా నటించారు.
ఈ క్రమంలోనే వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరు కలిసి మహాబలేశ్వరం స్వామివారిని కలవడం కోసం వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇకపోతే నటి పవిత్ర ఇదివరకే కన్నడ సీరియల్ నటుడు సుచేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిగా ఉంటున్నారు.
ఇప్పటివరకు పవిత్ర తన భర్తతో అధికారికంగా విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయం తెలియకపోయినప్పటికీ ఈమె నటుడు నరేష్ తో వివాహానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. ఇకపోతే గతంలో పవిత్ర తన భర్త గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ మాట్లాడుతూ సీరియల్ లో నటించే సమయంలో తన భర్త పరిచయమయ్యారని తెలిపారు.
ఈ విధంగా కన్నడ సీరియల్ లో నటిస్తున్న సమయంలో మా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ స్నేహం ప్రేమగా మారి ఇద్దరం 2007వ సంవత్సరంలో వివాహం చేసుకున్నామని తెలిపారు. నాతో పోల్చుకుంటే సుచేంద్ర ఎంతో బెటర్. అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు ఆయన చాలా మంచివారు. ఆయనలో ఒక లోపాన్ని కూడా గుర్తించలేము, అలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అంటూ పవిత్ర గతంలో తన భర్త గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అవుతున్నాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…