Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన వారాహి యాత్ర చేపట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా అధికార ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఈయన నిప్పులు చేరుగుతూ మాట్లాడుతున్నారు. తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వంపై పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీపై చూపిస్తున్నటువంటి వివక్షత గురించి మాట్లాడారు.. కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి సినిమాలు నిర్మిస్తే ఆ సినిమాలకు కేవలం 10, 20 రూపాయలు టికెట్ల రేట్లు నిర్ణయించడంతో నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని ఇదివరకే చాలామంది ఈ విషయంపై మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ సైతం టికెట్ల రేట్ల విషయం గురించి మాట్లాడారు.
ఏపీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్య చేపట్టిందని తెలిపారు. దీంతో తాను నటించిన సినిమాలు విడుదలవుతున్న సమయంలో పూర్తిగా టికెట్ల రేట్లు తగ్గించి ఆర్థికంగా నన్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారని తెలిపారు.ఇక తాను నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రెండు చాలా మంచి సక్సెస్ అందుకున్నాయి కానీ ఈ సినిమాలకు ఏపీలో బయ్యర్లకు చాలా నష్టాలు వచ్చాయని తెలిపారు.
ఇక భీమ్లా నాయక్ సినిమాకు భారీగా టికెట్ల రేట్లు తగ్గించడంతో ఏపీలో 30 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే ఆ నష్టాలు అన్నింటినీ తానే భరించానని ఉద్దేశపూర్వకంగానే ఏపీ సర్కార్ తనపై కక్ష సాధింపు చర్యలు చేపడుతూ రాత్రికి రాత్రి టికెట్ల రేట్లు తగ్గించినట్లు జీవో తీసుకువచ్చారని తెలిపారు.ఈ విధంగా టికెట్ల రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…