Prudhvi Raj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు పృథ్వీరాజ్ గురించి మనకు తెలిసిందే.30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో ఎంతో పాపులర్ అయిన ఈయన ఒకవైపు సినిమాలలో కొనసాగుతూనే గత ఎన్నికలలో వైయస్సార్ సిపి పార్టీ తరఫున ప్రచారం చేసి పార్టీ కార్యక్రమాలలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఇక ఈయన సేవలను గుర్తించిన వైసీపీ ప్రభుత్వం పృథ్వీరాజ్ కి ఎస్వీబీసీ చైర్ పర్సన్ గా బాధ్యతలు అప్పగించారు.
ఈ విధంగా ఎస్వీబీసీ చైర్ పర్సన్ బాధ్యతలను తీసుకున్న పృథ్వీరాజ్ ఒక మహిళతో ఎంతో అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఆడియో బయటకు రావడంతో ఆయనపై చర్యలు తీసుకుని అతని తొలగించిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా
పృథ్వీరాజ్ క్రమక్రమంగా పార్టీకి దూరమవుతూ వచ్చారు.అయితే ఈయన వైసీపీ పార్టీలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా రాజకీయ నాయకుడిగా రాజకీయాలలో ఇమడ లేకపోయిన పృథ్వీరాజ్ తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ కుటుంబం పై ఈయన ప్రశంసలు కురిపిస్తూ పలు వ్యాఖ్యలు చేయడమేకాకుండా తాజాగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలుపోటముల గురించి జోస్యం చెప్పారు.
తాజాగా ఒక న్యూస్ చానల్ తో మాట్లాడిన ఈయన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారని చాలామంది కామెంట్లు చేశారు అయితే వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ 40 నుంచి 50 వరకు గెలు పొందుతారని,పృథ్వీరాజ్ తెలిపారు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారని తాను రాసిస్తానని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్నారని ఆయన అతని పై ప్రశంసలు కురిపించారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి పృథ్వీరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…