Prudhvi Raj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు పృథ్వీరాజ్ గురించి మనకు తెలిసిందే.30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో ఎంతో పాపులర్ అయిన ఈయన ఒకవైపు సినిమాలలో కొనసాగుతూనే గత ఎన్నికలలో వైయస్సార్ సిపి పార్టీ తరఫున ప్రచారం చేసి పార్టీ కార్యక్రమాలలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఇక ఈయన సేవలను గుర్తించిన వైసీపీ ప్రభుత్వం పృథ్వీరాజ్ కి ఎస్వీబీసీ చైర్ పర్సన్ గా బాధ్యతలు అప్పగించారు.
ఈ విధంగా ఎస్వీబీసీ చైర్ పర్సన్ బాధ్యతలను తీసుకున్న పృథ్వీరాజ్ ఒక మహిళతో ఎంతో అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఆడియో బయటకు రావడంతో ఆయనపై చర్యలు తీసుకుని అతని తొలగించిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా
పృథ్వీరాజ్ క్రమక్రమంగా పార్టీకి దూరమవుతూ వచ్చారు.అయితే ఈయన వైసీపీ పార్టీలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా రాజకీయ నాయకుడిగా రాజకీయాలలో ఇమడ లేకపోయిన పృథ్వీరాజ్ తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ కుటుంబం పై ఈయన ప్రశంసలు కురిపిస్తూ పలు వ్యాఖ్యలు చేయడమేకాకుండా తాజాగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలుపోటముల గురించి జోస్యం చెప్పారు.
తాజాగా ఒక న్యూస్ చానల్ తో మాట్లాడిన ఈయన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారని చాలామంది కామెంట్లు చేశారు అయితే వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ 40 నుంచి 50 వరకు గెలు పొందుతారని,పృథ్వీరాజ్ తెలిపారు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారని తాను రాసిస్తానని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్నారని ఆయన అతని పై ప్రశంసలు కురిపించారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి పృథ్వీరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…