Prudhvi Raj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు పృథ్వీరాజ్ గురించి మనకు తెలిసిందే.30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో ఎంతో పాపులర్ అయిన ఈయన ఒకవైపు సినిమాలలో కొనసాగుతూనే గత ఎన్నికలలో వైయస్సార్ సిపి పార్టీ తరఫున ప్రచారం చేసి పార్టీ కార్యక్రమాలలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఇక ఈయన సేవలను గుర్తించిన వైసీపీ ప్రభుత్వం పృథ్వీరాజ్ కి ఎస్వీబీసీ చైర్ పర్సన్ గా బాధ్యతలు అప్పగించారు.
ఈ విధంగా ఎస్వీబీసీ చైర్ పర్సన్ బాధ్యతలను తీసుకున్న పృథ్వీరాజ్ ఒక మహిళతో ఎంతో అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఆడియో బయటకు రావడంతో ఆయనపై చర్యలు తీసుకుని అతని తొలగించిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా
పృథ్వీరాజ్ క్రమక్రమంగా పార్టీకి దూరమవుతూ వచ్చారు.అయితే ఈయన వైసీపీ పార్టీలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా రాజకీయ నాయకుడిగా రాజకీయాలలో ఇమడ లేకపోయిన పృథ్వీరాజ్ తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ కుటుంబం పై ఈయన ప్రశంసలు కురిపిస్తూ పలు వ్యాఖ్యలు చేయడమేకాకుండా తాజాగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలుపోటముల గురించి జోస్యం చెప్పారు.
తాజాగా ఒక న్యూస్ చానల్ తో మాట్లాడిన ఈయన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారని చాలామంది కామెంట్లు చేశారు అయితే వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ 40 నుంచి 50 వరకు గెలు పొందుతారని,పృథ్వీరాజ్ తెలిపారు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారని తాను రాసిస్తానని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్నారని ఆయన అతని పై ప్రశంసలు కురిపించారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి పృథ్వీరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…