Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే మరోవైపు రాజకీయ నాయకుడిగా కూడా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా రాజకీయ నాయకుడిగా కొనసాగుతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మరోవైపు తనకు వీలు దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా మంచి ఆదరణ సంపాదించుకుని కలెక్షన్ల పరంగా భారీగా కలెక్షన్లను రాబడుతుంది. ఈ సినిమానే పవన్ కళ్యాణ్ కు ఆఖరి సినిమా అని ఈయన రాజకీయాలలో బిజీ కాబోతున్నారని అందరూ భావించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రకటించిన మరో మూడు సినిమాలు షూటింగ్ పనులను జరుపుకోవాల్సి ఉంది.
ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజి షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఇంతకుముందే ప్రారంభమైనటువంటి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మధ్యలోనే ఉండిపోయింది. అదేవిధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ ప్రారంభించుకోలేదు. ఈ సినిమాలలో ఓజీ సినిమా మినహా మిగిలిన సినిమాలు అన్నీ కూడా ఎలక్షన్ల తర్వాతనే షూటింగ్ పనులు ప్రారంభిస్తారని అందరూ అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం హరీష్ శంకర్ ఉస్తాది భగత్ సింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ సినిమా మాస్ యాక్షన్ సినిమా కావడంతో ఎలక్షన్ల ముందు ఈ సినిమా విడుదలయితే తనకు కూడా కొంతమేర కలిసి వస్తుందని భావించిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే డైరెక్టర్ శంకర్ కి కొన్ని కండిషన్లు పెట్టారని తెలుస్తుంది. తన వద్ద కేవలం 30 కాల్ షీట్స్ మాత్రమే ఉన్నాయని, 30 రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని కండిషన్ పెట్టారట.సరైన హిట్టు లేక బాగా ఆకలితో ఉన్నటువంటి హరీష్ శంకర్ కు 30 రోజులు అంటే చాలా ఎక్కువ సమయం అని చెప్పాలి అయితే ఈ సినిమా ఆగస్టు రెండవ వారంలో షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుందని తెలుస్తుంది.
బెంగళూరులో ఓ కుటుంబం గడచిన రోజుల్లో అనుభవించిన సంఘటన వాస్తవానికి ప్రతి తల్లిదండ్రి గుండెను గుద్దేసేలా ఉంది. రాత్రి ఇంటికి…
కేరళలోని ప్రముఖ రిటైల్ స్పేస్ కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులను అదిరిపోయే విధంగా సర్ప్రైజ్…
టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్డ్ పేర్లలో ఒకరు.…
సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…
ఉత్తరప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…
తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్లో సుహాస్ ఇప్పుడు…