Jagapathi Babu: జగపతిబాబు సింహస్వప్నం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జగపతిబాబుకు అనంతరం అవకాశాలు తగ్గిపోయాయి ఇలా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈయనకు లెజెండ్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన జగపతిబాబుకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక జగపతిబాబు ఇండస్ట్రీలోకి వచ్చే ముందే ఈయన రాజేంద్రనాథ్ అనే ప్రముఖ నిర్మాత కుమారుడు. వారసత్వంగా జగపతిబాబు వందల కోట్ల రూపాయల ఆస్తులను అందుకున్నారు. ఇక సినిమాలలో కూడా భారీగా సంపాదించారు కానీ వీటన్నింటినీ ఈయన కోల్పోయారు.
ఈ విధంగా జగపతిబాబు 100 కోట్ల ఆస్తులను పోగొట్టుకోనీ చివరికి తాను అంటున్నటువంటి ఇంటిని కూడా అమ్మేయాలని భావించారు. అలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో లెజెండ్ ఈయనకు తిరుగులేని విజయాన్ని అందించిందని చెప్పాలి.అయితే జగపతిబాబు వందల కోట్ల రూపాయల ఆస్తులను ఎలా పోగొట్టుకున్నారు అనే విషయానికి వస్తే ఆయనకు క్యాసినో గ్యాబ్లింగ్ వంటి అలవాట్లు ఉన్నాయి వీటి ద్వారా వంద కోట్ల రూపాయల ఆస్తులను పోగొట్టుకున్నారు. అదేవిధంగా కొందరుకు డబ్బు ఇచ్చి కూడా వారు తిరిగి ఇవ్వకపోవడంతో నష్టపోయారని తెలుస్తుంది.
ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి సమయంలో తన వద్ద రెండు ఫోన్లు ఉన్నాయని ఎవరైనా ఫోన్ చేసి తనకు అవకాశం ఇస్తారేమోనని ఎదురుచూస్తూ ఉండేవాడిననీ తెలిపారు. సెకండ్ ఇన్నింగ్స్ తనకు అవకాశాలు వస్తే ఒక 30 కోట్ల రూపాయలు సంపాదించుకొని జీవితాంతం హ్యాపీగా సెటిలైపోతానని భావించాను. కానీ సెకండ్ ఇన్నింగ్స్ 30 కోట్ల కన్నా ఎక్కువగానే సంపాదించానని మిగిలినదంతా బోనస్…తనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు చాలా సంతోషంగా ఉన్నానని జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…