Jagapathi Babu: జగపతిబాబు సింహస్వప్నం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జగపతిబాబుకు అనంతరం అవకాశాలు తగ్గిపోయాయి ఇలా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈయనకు లెజెండ్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన జగపతిబాబుకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక జగపతిబాబు ఇండస్ట్రీలోకి వచ్చే ముందే ఈయన రాజేంద్రనాథ్ అనే ప్రముఖ నిర్మాత కుమారుడు. వారసత్వంగా జగపతిబాబు వందల కోట్ల రూపాయల ఆస్తులను అందుకున్నారు. ఇక సినిమాలలో కూడా భారీగా సంపాదించారు కానీ వీటన్నింటినీ ఈయన కోల్పోయారు.
ఈ విధంగా జగపతిబాబు 100 కోట్ల ఆస్తులను పోగొట్టుకోనీ చివరికి తాను అంటున్నటువంటి ఇంటిని కూడా అమ్మేయాలని భావించారు. అలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో లెజెండ్ ఈయనకు తిరుగులేని విజయాన్ని అందించిందని చెప్పాలి.అయితే జగపతిబాబు వందల కోట్ల రూపాయల ఆస్తులను ఎలా పోగొట్టుకున్నారు అనే విషయానికి వస్తే ఆయనకు క్యాసినో గ్యాబ్లింగ్ వంటి అలవాట్లు ఉన్నాయి వీటి ద్వారా వంద కోట్ల రూపాయల ఆస్తులను పోగొట్టుకున్నారు. అదేవిధంగా కొందరుకు డబ్బు ఇచ్చి కూడా వారు తిరిగి ఇవ్వకపోవడంతో నష్టపోయారని తెలుస్తుంది.
ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి సమయంలో తన వద్ద రెండు ఫోన్లు ఉన్నాయని ఎవరైనా ఫోన్ చేసి తనకు అవకాశం ఇస్తారేమోనని ఎదురుచూస్తూ ఉండేవాడిననీ తెలిపారు. సెకండ్ ఇన్నింగ్స్ తనకు అవకాశాలు వస్తే ఒక 30 కోట్ల రూపాయలు సంపాదించుకొని జీవితాంతం హ్యాపీగా సెటిలైపోతానని భావించాను. కానీ సెకండ్ ఇన్నింగ్స్ 30 కోట్ల కన్నా ఎక్కువగానే సంపాదించానని మిగిలినదంతా బోనస్…తనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు చాలా సంతోషంగా ఉన్నానని జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…