Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే మరోవైపు రాజకీయ నాయకుడిగా కూడా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా రాజకీయ నాయకుడిగా కొనసాగుతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మరోవైపు తనకు వీలు దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా మంచి ఆదరణ సంపాదించుకుని కలెక్షన్ల పరంగా భారీగా కలెక్షన్లను రాబడుతుంది. ఈ సినిమానే పవన్ కళ్యాణ్ కు ఆఖరి సినిమా అని ఈయన రాజకీయాలలో బిజీ కాబోతున్నారని అందరూ భావించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రకటించిన మరో మూడు సినిమాలు షూటింగ్ పనులను జరుపుకోవాల్సి ఉంది.
ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజి షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఇంతకుముందే ప్రారంభమైనటువంటి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మధ్యలోనే ఉండిపోయింది. అదేవిధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ ప్రారంభించుకోలేదు. ఈ సినిమాలలో ఓజీ సినిమా మినహా మిగిలిన సినిమాలు అన్నీ కూడా ఎలక్షన్ల తర్వాతనే షూటింగ్ పనులు ప్రారంభిస్తారని అందరూ అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం హరీష్ శంకర్ ఉస్తాది భగత్ సింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ సినిమా మాస్ యాక్షన్ సినిమా కావడంతో ఎలక్షన్ల ముందు ఈ సినిమా విడుదలయితే తనకు కూడా కొంతమేర కలిసి వస్తుందని భావించిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే డైరెక్టర్ శంకర్ కి కొన్ని కండిషన్లు పెట్టారని తెలుస్తుంది. తన వద్ద కేవలం 30 కాల్ షీట్స్ మాత్రమే ఉన్నాయని, 30 రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని కండిషన్ పెట్టారట.సరైన హిట్టు లేక బాగా ఆకలితో ఉన్నటువంటి హరీష్ శంకర్ కు 30 రోజులు అంటే చాలా ఎక్కువ సమయం అని చెప్పాలి అయితే ఈ సినిమా ఆగస్టు రెండవ వారంలో షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుందని తెలుస్తుంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…