General News

ప్రజలకు అలర్ట్.. ఫిబ్రవరి నుంచి వారికి రేషన్ లేనట్టేనా..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఆదాయం కలిగి ఉన్నవారు రేషన్ కార్డును కలిగి ఉంటే రేషన్ సరుకులను పొందవచ్చనే సంగతి తెలిసిందే. ప్రతి నెలా రేషన్ కార్డ్ ఉన్నవాళ్లు రేషన్ డీలర్ ను సంప్రదించి సరుకులను పొందవచ్చు. అయితే ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఈ కేవైసీ చేయించని 64,800 కార్డులను రేషన్ ను నిలిపివేయనున్నారని తెలుస్తోంది. వీరికి సరుకుల సరఫరా తాత్కాలికంగా ఆగనుందని ప్రచారం జరుగుతోంది.

ఈ కేవైసీ పూర్తి కాని కార్డు లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసిన తరువాతే సరుకులను పొందే అవకాశం ఉంటుందని సమాచారం. అధికారులు గడిచిన మూడు నెలల నుంచి ఈకేవైసీ చేయించుకోవాలని రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సూచనలు చేస్తున్నా ఈకేవైసీ చేయించుకోవడంలో కొందరు లబ్ధిదారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. దీంతో ఈకేవైసీ చేయించుకోని వారికి రేషన్ నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లాలో మొత్తం 8.7 లక్షల కార్డుదారుల్లో 64,800 మంది కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోలేదు. జగన్ సర్కార్ రాష్ట్రంలో ఫిబ్రవరి నెల నుంచి రేషన్ డోర్ డెలివరీ పంపిణీ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేసుకోని వారు గ్రామ, వార్డు వాలంటీర్లను కలవడం లేదా సమీపంలోని గ్రామ, వార్డ్ సచివాలయ అధికారులను సంప్రదించడం ద్వారా ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు.

అధికారులే స్వయంగా ఈకేవైసీ చేయించుకోకపోతే సరుకుల పంపిణీ జరగదని చెబుతుండటం గమనార్హం. ఈకేవైసీ చేయించుకోక పోతే కార్డులు రద్దయ్యే అవకాశం కూడా ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

బాలీవుడ్‌లో దక్షిణాది నటీమణులపై వివక్ష?.. రెజీనా సంచలన వ్యాఖ్యలు…

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…

4 minutes ago

గ్రూప్ స్టేజ్ ముగిసింది.. సూపర్-8 సంగ్రామం మొదలు! టీమిండియాకు అసలు పరీక్ష ఇప్పుడు…

2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…

19 minutes ago

“ఇస్రోలో ఇంటర్న్‌షిప్ ఛాన్స్.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో దరఖాస్తులు ప్రారంభం!”

అంతరిక్ష రంగంలో కెరీర్‌ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…

32 minutes ago

“దేశంలో ఎక్కడా లేని శివలింగం.. తిరుపతి సమీపంలోనే అరుదైన అద్భుతం!”

తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…

42 minutes ago

“తమిళ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్?.. స్టాలిన్‌ను కలిసిన ఓపీఎస్!”

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…

1 hour ago

“చిన్న ఉద్యోగులకు బిగ్ రీలీఫ్.. 2025 లేబర్ కోడ్‌తో తప్పనిసరి అపాయింట్‌మెంట్ లెటర్!”

భారతదేశంలో ఉద్యోగ రంగంలో కీలక మార్పులకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త లేబర్ కోడ్‌లు ఇప్పుడు…

1 hour ago