కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో రైళ్లను నడపడం శ్రేయస్కరం కాదని ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. అంతేకాకుండా రాష్ట్రాల అప్పులను రీషెడ్యుల్ చేయాలనీ, ఎఫ్ ఆర్బీఎం పరిమితి పెంచాలని, ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆయా రాష్ట్రాలు అనుమతించాలని కేసీఆర్ సూచించారు. మే 17 తో ముగియనున్న లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రధానంగా మూడు అంశాలను ప్రధానికి వివరించారు.
కాగా, జులై, ఆగస్టు నెలల్లో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, అది కూడా హైదరాబాద్ నుంచి వచ్చే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే రైళ్లను పునరుద్దరించవద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. దేశంలో చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా భాదితులున్నారు. అందువల్ల ఇప్పుడు రైళ్లు నడిపితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజల రాకపోకలు ఎక్కువగా జరుగుతాయి. ఎవరు ఎటు వెళ్తున్నారో, అందులో ఎవరికీ కరోనా ఉందొ తెలియదు. ఈ నేపథ్యంలో అందరికి టెస్టులు చేయడం కూడా కుదరదు. అందువల్ల ఇప్పుడు ప్రయాణికుల రైళ్లను నడపవద్దని కేసీఆర్ కోరారు.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…