Featured

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ నగదు రూ.10,000కు పెంచే ఛాన్స్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రతి సంవత్సరం దేశంలో అర్హులైన రైతులకు 6,000 రూపాయల చొప్పున పీఎం కిసాన్ స్కీమ్ నగదును జమ చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నగదు ఉపయోగపడుతోంది. అయితే కేంద్రం రైతులకు మరో తీపికబురు అందించేందుకు సిద్ధమవుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్రం ప్రస్తుతం 6,000 రూపాయలు జమ చేస్తుండగా ఇకపై 10,000 రూపాయలు జమ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

రాబోయే బడ్జెట్ లో కేంద్రం నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీ 2021 సంవత్సరంలో మోదీ సర్కార్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ ను ప్రవేశెపెడుతుందో అని దేశంలోని ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నగదును 10,000 రూపాయలకు పెంచితే మాత్రం రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. అయితే అధికారిక ప్రకటన వస్తే మాత్రమే జరుగుతున్న ఈ ప్రచారంలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. రోజురోజుకు రైతులకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. కొన్ని పంటలకు మంచి దిగుబడి వస్తున్నా గిట్టుబాటు ధర లభించడం లేదు. దేశంలోని చాలామంది రైతులకు పీఎం కిసాన్ నగదు సాయం కొంతమేర ఉపయోగపడుతోంది.

బడ్జెట్ పై ప్రజల్లో భారీగా అంచనాలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి బడ్జెట్ ను ప్రవేశపెడుతుందో చూడాల్సి ఉంది. నివేదికలు సైతం పీఎం కిసాన్ నగదును పెంచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నాయి. పీఎం కిసాన్ నగదును నిజంగా పెరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago