మన దేశంలో 15,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం వేతనం తీసుకునే ఉద్యోగులతో పోలిస్తే 15,000 రూపాయల కంటే తక్కువ మొత్తం వేతనం తీసుకునే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. తక్కువ మొత్తం వేతనం పొందుతున్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ అనే పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం రిటైర్మెంట్ తర్వాత ప్రయోజనం పొందాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
సాధారణంగా సంఘటిత రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లభిస్తుంది. అయితే అసంఘటిత రంగంలో పని చేసే వాళ్లకు ఎలాంటి పెన్షన్ లభించదు. ఇలా పెన్షన్ పొందలేని వారికి పెన్షన్ పొందే అవకాశం కల్పించడానికి కేంద్రం ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్ ధన్ పథకం అమలు చేస్తోంది. అసంఘటిత రంగంలో పని చేసే వాళ్లకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ అమలు జరుగుతోంది.
అసంఘటిత రంగంలో పని చేస్తూ 15,000 రూపాయల లోపు వేతనం ఉన్నవాళ్లు వయస్సును బట్టి నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల మధ్య చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కోసం ధరఖాస్తు చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. లబ్ధిదారులు జమ చేసే మొత్తానికి సమానంగా కేంద్రం అంతే మొత్తాన్ని ఖాతాలలో జమ చేస్తుంది. లబ్ధిదారులు మరణిస్తే వారికి బదులుగా వారి జీవిత భాగస్వామి పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.
అసంఘటిత రంగంలో పని చేసే ఎవరైనా ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వారికి 8 శాతం చొప్పున వడ్డీ జమవుతుంది. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ, ఎల్.ఐ.సీ కార్యాలయాల ద్వారా ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…