General News

రూ. 15 వేల లోపు జీతం ఉన్నవాళ్లకు శుభవార్త.. ఈ స్కీమ్ ద్వారా డబ్బులు పొందే ఛాన్స్..?

మన దేశంలో 15,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం వేతనం తీసుకునే ఉద్యోగులతో పోలిస్తే 15,000 రూపాయల కంటే తక్కువ మొత్తం వేతనం తీసుకునే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. తక్కువ మొత్తం వేతనం పొందుతున్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ అనే పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం రిటైర్మెంట్ తర్వాత ప్రయోజనం పొందాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

సాధారణంగా సంఘటిత రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లభిస్తుంది. అయితే అసంఘటిత రంగంలో పని చేసే వాళ్లకు ఎలాంటి పెన్షన్ లభించదు. ఇలా పెన్షన్ పొందలేని వారికి పెన్షన్ పొందే అవకాశం కల్పించడానికి కేంద్రం ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్ ధన్ పథకం అమలు చేస్తోంది. అసంఘటిత రంగంలో పని చేసే వాళ్లకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ అమలు జరుగుతోంది.

అసంఘటిత రంగంలో పని చేస్తూ 15,000 రూపాయల లోపు వేతనం ఉన్నవాళ్లు వయస్సును బట్టి నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల మధ్య చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కోసం ధరఖాస్తు చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. లబ్ధిదారులు జమ చేసే మొత్తానికి సమానంగా కేంద్రం అంతే మొత్తాన్ని ఖాతాలలో జమ చేస్తుంది. లబ్ధిదారులు మరణిస్తే వారికి బదులుగా వారి జీవిత భాగస్వామి పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

అసంఘటిత రంగంలో పని చేసే ఎవరైనా ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వారికి 8 శాతం చొప్పున వడ్డీ జమవుతుంది. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ, ఎల్.ఐ.సీ కార్యాలయాల ద్వారా ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

5 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

5 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

5 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

5 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

5 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

5 hours ago