మన దేశంలో 15,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం వేతనం తీసుకునే ఉద్యోగులతో పోలిస్తే 15,000 రూపాయల కంటే తక్కువ మొత్తం వేతనం తీసుకునే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. తక్కువ మొత్తం వేతనం పొందుతున్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ అనే పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం రిటైర్మెంట్ తర్వాత ప్రయోజనం పొందాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
సాధారణంగా సంఘటిత రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లభిస్తుంది. అయితే అసంఘటిత రంగంలో పని చేసే వాళ్లకు ఎలాంటి పెన్షన్ లభించదు. ఇలా పెన్షన్ పొందలేని వారికి పెన్షన్ పొందే అవకాశం కల్పించడానికి కేంద్రం ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్ ధన్ పథకం అమలు చేస్తోంది. అసంఘటిత రంగంలో పని చేసే వాళ్లకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ అమలు జరుగుతోంది.
అసంఘటిత రంగంలో పని చేస్తూ 15,000 రూపాయల లోపు వేతనం ఉన్నవాళ్లు వయస్సును బట్టి నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల మధ్య చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కోసం ధరఖాస్తు చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. లబ్ధిదారులు జమ చేసే మొత్తానికి సమానంగా కేంద్రం అంతే మొత్తాన్ని ఖాతాలలో జమ చేస్తుంది. లబ్ధిదారులు మరణిస్తే వారికి బదులుగా వారి జీవిత భాగస్వామి పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.
అసంఘటిత రంగంలో పని చేసే ఎవరైనా ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వారికి 8 శాతం చొప్పున వడ్డీ జమవుతుంది. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ, ఎల్.ఐ.సీ కార్యాలయాల ద్వారా ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…