మన సమాజంలో పోలీసులకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉందో మనకు తెలిసిందే. ఏ చిన్న సమస్య ఎదురైనా, ఎటువంటి అన్యాయం జరిగిన ప్రజలు వెళ్లి ముందుగా పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటారు.అయితే ఈ విధంగా పోలీసుల వద్దకు న్యాయం కావాలని వచ్చిన ప్రజల పట్ల పోలీసుల ప్రవర్తన ఏ విధంగా ఉందో తెలుసుకోవడం కోసం ఏకంగా పోలీస్ కమిషనర్ మారువేషంలో పోలీస్ స్టేషన్ సందర్శించి ఫిర్యాదులు చేసిన ఘటన తాజాగా చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడా కమిషనరేట్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ కమిషనర్ కృష్ణ ప్రకాష్ మారువేషంలో పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసుల పనితీరు గమనించాడు. కేవలం కమిషనర్ కృష్ణ ప్రకాష్ మాత్రమే కాకుండా అతని భార్య అసిస్టెంట్ కమిషనర్ ప్రేర్నా కట్టే మారు వేషంలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది.కృష్ణ ప్రకాష్ మారువేషంలో మొదట రెండు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయగా అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితులను గమనించారు. కానీ మూడవ పోలీస్ స్టేషన్ కు వెళ్ళినప్పుడు స్పందించకపోవడంతో తన అసలు రూపం చూపించాడు.
మొదటి రెండు పోలీస్ స్టేషన్లకు వెళ్లిన సూర్య ప్రకాష్ మొదటిగా కొంతమంది దుండగులు తన భార్యని వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే స్పందించారు. రెండవ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు తన భార్య మెడలో గొలుసు ఎవరో దొంగలించారని ఫిర్యాదు చేయగా అక్కడ కూడా పోలీసులు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను ఆరా తీశారు.
ఇక మూడవ సారీ పింప్రి పోలీస్ స్టేషన్కి మారు వేషంలో వెళ్లి కరోనా పెషేంట్ను తరలించడానికి అంబులెన్స్ డ్రైవర్ 8 వేల రూపాయలు లంచం అడుగుతున్నారని ఫిర్యాదు చేయగా అందుకు పోలీసులు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి అది తమ స్టేషన్ పరిధిలోకి రాదని ఆ పరిధిలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయాలని సమాధానం చెప్పడంతో కృష్ణ ప్రకాష్ అసలు రూపం చూపించి పోలీస్ స్టేషన్ అధికారులపై వేటు వేశారు. మిగిలిన రెండు పోలీస్ స్టేషన్ లోని పోలీసులపై కమిషనర్ కృష్ణ ప్రకాష్ ప్రశంసలు కురిపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…