Pooja Hedge: ముకుంద సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన పూజా హెగ్డే ఆ తర్వాత అలా వైకుంఠపురం సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో ఎందరో స్టార్ట్ హీరోల సరసన నటించిన పూజ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అంతే కాకుండా మరొకవైపు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంది.
ఇదిలా ఉండగా ఇటీవల ఈ అమ్మడికి వరుస పరాపజయాలు ఎదురవుతున్నాయి. ఈ అమ్మడు నటించిన సినిమాలు అన్నీ కూడా ప్లాఫ్ అవడంతో ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
అయినప్పటికీ తెలుగు, హిందీ భాషలలో అవకాశాలు మాత్రం తగ్గటం లేదు. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సరసన ఎస్ ఎస్ ఎం బి 28 సినిమాలో నటిస్తోంది. అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో మహేష్బాబు ఫ్యామిలీ తో ఫారెన్ వెళ్లారు. మరోవైపు పూజా హెగ్డే సైతం వెకేషన్కి వెళ్లింది.. ఈ క్రమంలో ఆమె శ్రీలంకలో సందడి చేస్తోంది. ప్రస్తుతం శ్రీలంక వెకేషన్ కి సంబంధించిన పూజా హెగ్డే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలలో జబ్బలపై టాప్ జారిపోతుండగా, చిలిపి నవ్వులు చిందిస్తూ పూజా హెగ్డే ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అయితే శ్రీలంక వెకేషన్ లో పూజా హెగ్డే తన ఖరీదైన కార్లను పక్కనపెట్టి ఆటోలో ప్రయాణించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పూజా హెగ్డే కి కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయి. ఏ దేశానికి వెళ్లినా కూడా లగ్జరీ విషయంలో ఏమాత్రం వెనుకాడరు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఖరీదైన కార్లల్లో తిరుగుతూ ఉంటారు. కానీ శ్రీలంకలో మాత్రం పూజా హెగ్డే ఖరీదైన కార్లను పక్కనపెట్టి ఒక సామాన్య వ్యక్తి లాగా ఆటోలో ప్రయాణించడం ఆశ్చర్యపరుస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజెన్లు ఆమె మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీలంకలో త్వరగా వెళ్లేందుకు తాను ఆటోని ఆశ్రయించినట్టుగా పూజ తెలిపింది. దీంతో ఆమె తన అవసరం కోసం ఆటోలో వెళ్లినా కూడా మే డే రోజు ఆటోలో ప్రయాణించడంతో అభినందనలు తెలియజేస్తున్నారు. కార్మికుల్లో ఒకరైన ఆటో డ్రైవర్లకి కొంత సపోర్ట్ గా నిలిచినట్టే అవుతుందని, వారిని గౌరవించినట్టే అవుతుందని ఆమె అభిమానులు కొనియాడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…