Poonam Kaur: మాయాజాలం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయయ్యారు నటి పూనమ్ కౌర్. ఇలా పలు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలో నటిగా సక్సెస్ కాలేకపోయినా ఈమె మాత్రం ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు తరచూ సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఎంతో పేరు పొందారు.
ఈమె ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా తన అభిప్రాయాలను తెలియజేయడం వల్ల తాను చేసే వ్యాఖ్యలు కారణంగా వార్తల్లో నిలుస్తూ ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటారు. తాజాగా ఈమె ఒక కార్యక్రమంలో పాల్గొని వేదికపై కంటతడి పెట్టుకున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్ భవన్ లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ నేను తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే పెరిగాను. కానీ నన్ను మాత్రం నా మతం పేరుతో వేరు చేస్తున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు.
నేను పంజాబీ అని, సిక్కు అని నా మతం చూసి నన్ను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారని, అలా నన్ను వేరు చేయకండి నేను కూడా తెలంగాణ బిడ్డనే అంటూ ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోలపై పలువురు యధావిధిగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…