Rajamouli: సినిమా ఇండస్ట్రీలో దర్శక దీరుడుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు సంపాదించుకున్నటువంటి రాజమౌళి హీరోలతో చాలా స్నేహంగా ఉంటారు.ముఖ్యంగా ఈయన ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి హీరోలతో చాలా స్నేహభావంతో ఉంటారు.
రాజమౌళి ఈ ముగ్గురు హీరోలతో కలిసి ఎక్కువగా సినిమాలు చేశారు.ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించినటువంటి చిత్రం RRR . ఈ సినిమా ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచింది. ఇకపోతే కొన్నిసార్లు మన మధ్య మన స్నేహితుల మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటే చాలా సంతోషం వేస్తుంది.
ప్రస్తుతం ఇలాంటి ఆనందంలో రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు ఉన్నారు.గతంలో వీరి ముగ్గురి మధ్య జరిగినటువంటి ఓ సంఘటనకు సంబంధించిన ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా రాజమౌళి చేసినటువంటి ఈ ట్వీట్ లో ఏముంది అనే విషయానికి వస్తే…
గత 12 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి రామ్ చరణ్ ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ వద్దన్న వినకుండా బలవంతంగా తనతో వోడ్కా తాగించారని ఈ సందర్భంగా రాజమౌళి చేసినటువంటి ఈ ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ బర్తడే పార్టీలో బాలయ్య కూడా డాన్స్ అదరగొట్టారు అంటూ రాజమౌళి చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.ఇలా 12 సంవత్సరాల క్రితమే వీరి మధ్య ఎంతో మంచి అనుబంధము ఉంది అయితే ఈ ముగ్గురి కాంబినేషన్లో తాజాగా RRR సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఈ సినిమా సంచలనాలను సృష్టించడం అభిమానులలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ ముగ్గురు ఆస్కార్ అవార్డు కార్యక్రమాలలో భాగంగా అమెరికాలో సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…