Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?
Posani Krishna Murali:ఇండస్ట్రీలో దర్శకుడిగా రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పోసాని మురళీకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో దర్శకుడిగా రచయితగా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో అందరూ మెంటల్ కృష్ణ అని కూడా పిలుస్తుంటారు.అయితే వీటి గురించి ఈయన ఏమాత్రం లెక్క చేయకుండా తన ఇష్ట ధోరణిలో నడుస్తూ తన ఇష్టాను గుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే పోసాని మురళీకృష్ణ ఎప్పుడు ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఎవరికి తెలియదు. ఈ క్రమంలోనే పోసాని గతంలో ఒక డైరెక్టర్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.అయితే ఈయన ఓ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా ఆ సినిమాకు పనిచేసే కో డైరెక్టర్ పట్ల ఎంతో అవమానకరంగా ప్రవర్తించారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆ కో డైరెక్టర్ కి ఈయన తన పాడ్ తెచ్చి పెట్టమని చెప్పారట.అయితే తన పెన్ను పాడ్ కనిపించకపోవడంతో ఆ కో డైరెక్టర్ కనిపించలేదు అని సమాధానం చెప్పగా వెంటనే పోసాని తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనిపించలేదు ఏంటి సార్ అని పిలవలేవా అంటూ అందరి ముందే తిట్టారట. అయితే కొంత సమయం తర్వాత కో డైరెక్టర్ మాట్లాడుతూ మురళి అని పిలిచారట.
ఇలా తనని పేరు పెట్టి పిలవడంతో మండిపోయిన పోసాని తనని కాళ్ళతో తన్ని మురళి ఏంటి మురళి మురళి గారు అని పిలవలేవా అంటూ అందరి ముందు అవమానించానని స్వయంగా ఒప్పుకున్న ఈయన నా మేనరిజం స్ట్రగుల్ అలా ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు.
ఈ విధంగా డైరెక్టర్ పట్ల ఈయన అవమానించిన తీరును తెలియజేయడంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ప్రస్తుతం పోసాని ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…