మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త సంవత్సరంతో పాటు ఆరోజు నుంచి కొత్త నిబంధనలు సైతం అమలులోకి రాబోతున్నాయి. ఈ కొత్త నిబంధనలు దేశంలోని ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతున్నాయి. భారతదేశ ప్రజలు ఈ నిబంధనల గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉంటే మంచిది. కొత్త రూల్స్ ప్రభావం దేశంలోని చాలామందిపై ఉండనున్న నేపథ్యంలో నిబంధనల గురించి అవగాహన లేకపోతే ఇబ్బందులు పడక తప్పదు.
కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ దేశంలోని నాలుగు చక్రాల వాహనాలను ఫాస్టాగ్ కచ్చితంగా ఉండాలని నిబంధనలు జారీ చేసింది. జనవరి 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ ఉన్న వాహనాలను మాత్రమే టోల్ గేట్ల దగ్గర అనుమతించడం జరుగుతుంది. ఆర్బీఐ జనవరి 1వ తేదీ నుంచి 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో జరిపే లావాదేవీలకు రీకన్ఫర్మేషన్ ద్వారా మరోసారి వివరాలను వెరిఫై చేసుకుంటుంది.
జనవరి 1వ తేదీ నుంచి కాంటాక్ట్ లెస్ కార్డుల లావాదేవీల పరిమితి 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయలకు పెరగనుంది. దీంతో కాంటాక్ట్ లెస్ కార్డుల ద్వారా సులభంగా లావాదేవీలను నిర్వహించడం సాధ్యమవుతుంది. జనవరి 1వ తేదీ నుంచి చిన్న వ్యాపారులు ప్రతి నెలా కాకుండా మూడు నెలలకు ఒకసారి దాఖలు చేసే అవకాశం ఉంది. జనవరి 1వ తేదీ నుంచి కొత్త కార్లు, కొత్త బైకుల ధరలు భారీగా పెరగనున్నాయి.
2021లో ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్ కు కాల్ చేయాలంటే ముందు 0 తప్పనిసరిగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలం చెల్లిన సాఫ్ట్ వేర్ ఉన్న ఫోన్లలో కొత్త ఏడాదిలో వాట్సాప్ యాప్ పని చేయదు. జనవరి 1వ తేదీ నుంచి దేశంలోని ప్రజలకు ఆరోగ్య సంజీవని పేరుతో పాలసీలు అందుబాటులోకి రానున్నాయి. గతంతో పోలిస్తే యూపీఐ చెల్లింపులు సైతం భారీగా పెరగనున్నాయి. థర్డ్ పార్టీ చెల్లింపులకు ఇకపై అదనపు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించిన నిబంధనల్లో సైతంలో మార్పులు ఉంటాయని సమాచారం.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…